భావనారాయణ స్వామి దేవాలయము
శ్రీ భావన్నారాయణ స్వామి దేవాలయము | |
---|---|
![]() శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయ గోపురం | |
భౌగోళికాంశాలు : | 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°ECoordinates: 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ భావన్నారాయణ స్వామి దేవాలయము |
ప్రదేశము | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | తూర్పు గోదావరి |
ప్రదేశం: | కాకినాడ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శ్రీ భావన్నారాయణ స్వామి దేవాలయము |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 1400 |
శ్రీశ్రీశ్రీ భావన్నారాయణ స్వామి దేవాలయము తెలుగు రాష్ట్రములోని ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఇది సుమారు 1400 సంవత్సరాలకు పూర్వము చోళుల చే నిర్మితమైనది. శైవమునకు పంచారామక్షేత్రాలు ఉన్నట్టుగానే వైష్ణవమునకు కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి బాపట్ల (భావపురి), పొన్నూరు (స్వర్ణపురి), భావదేవరపల్లి (కృష్ణా జిల్లా), సర్పవరం (నేడు కాకినాడలో అంతర్భాగం), పట్టసం. వీనిలో ప్రకాశం జిల్లాలోని పెదగంజాం కూడా ఉంది అని చెప్తారు. వీటిలో ప్రధానమైనది బాపట్ల. ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్ల గా, బాపట్లగా మారింది. ఈ దేవాలయంలో భావన్నారాయణుడు ఇతర పరివార దేవతలయిన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవార్లు, ఆళ్వారులతో కొలువైవుండి భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా కేశవస్వామి ఎంతో సుందరంగా ఉండి భక్తులకు కనువిందు చేస్తాడు.
శ్రీ కృష్ణదేవరాయలు ఈ దేవస్థానాన్ని సందర్శించినట్టుగా ఆధారాలున్నాయి. ఆలయంలోని ప్రతి రాతిపైనా స్థలపురాణం, ఆలయచరిత్ర ఇత్యాది విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ప్రతిఏటా వేసవికాలంలో వైభవంగా జరిగే తిరునాళ్ల (బ్రహ్మోత్సవాలు) కు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చిచేరతారు.
చాలాకాలంగా మరామత్తులకు నోచుకోని ఆలయ గాలి గోపురం (పక్కన ఉన్న బొమ్మ ఈ గాలిగోపురము నదే) అక్టోబరు23, 2011 న కుప్పకూలింది.
ఆలయ విశేషాలు[మార్చు]
- భావన్నారాయణ స్వామి మూర్తి కాలి వేళ్లపై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉంటుందట.
- మరో వింత ఏమిటంటే ఆలయంలోపల చలికాలంలో వెచ్చగాను, ఎండాకాలంలో చల్లగాను మనం అనుభూతికిలోనవుతాం.
- గతంలో ఆలయంలోనే శివాలయం కూడా అంతర్భాగంగా ఉండేది.
- ఈ ఆలయానికి రెండు ధ్వజ స్తంభాలు ఉండటం, ఆలయ స్తంభాలు గజపాద ( ఏనుగు కాలు) ఆకారంలో స్తంభాలు ఉండటం విశేషం.
- ఆలయంలో గర్భగుడి వెనుక పైకప్పు పై మత్స్యం (చేప ఆకారం) కనిపిస్తుంది. దాన్ని తాకితే శుభమని భక్తులు భావిస్తారు.
- దేశములోనే ఎక్కడాలేనట్టుగా విఖనస మునీంద్రులకు కూడా మందిరము ఉంది...అందుకే బాపట్ల మంచి విద్యాకేంద్రంగా వెలుగొందుతున్నదని చెప్తారు.
ఆలయచరిత్ర[మార్చు]
ఇది స్వయంవ్యక్తక్షేత్రం. ఈ ఆలయం శాలివాహన శకం 515 (కల్యాది 3694, క్రీశ 594) లో క్రిమికంఠ చోళునిచే నిర్మించబడింది. గ్రామం 8 దిక్కులలో వళ్ళాలమ్మ, కుంచలమ్మ, శంకరమ్మ, శింగారమ్మ, ధనకొండలమ్మ, మూలకారమ్మ, నాగభూషణమ్మ, బొబ్బలమ్మ అనే గ్రామశక్తులను ప్రతిష్ఠించారు. క్రిమికంఠచోళుని తర్వాత, ఈ ప్రాంతంపై ఆధిపత్యం వరుసగా నెరిపింది చోళభూపాల దేవుడు, వీర ప్రతాపశూర భల్లయ చోళ మహారాజు, కుళోత్తుంగ చోళయదేవ మహారాజులు. ఆ తరువాత గజపతులు (1319 వరకు), తర్వాత శ్రీకృష్ణదేవరాయలు (18సం.లు) తర్వాత అచ్యుతదేవరాయల, సదాశివరాయల ఆధీనంలో ఈ ఆలయం మహోజ్వలంగా వెలిగింది. ఆ కాలంలో ఎంతగానో ప్రసిద్ధి చెందింది. కానీ తదనంతరం వచ్చిన మహ్మదీయుల, ఫ్రెంచి, ఆంగ్లేయుల దండయాత్రలకు, దోపిడీలకు లోనైంది. వారు అతి ప్రాచీనమైన ఆలయ శిల్పసంపదకుకు ఎనలేని నష్టం చేసారు. క్రమంగా ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది.
ఫ్రెంచివారు గ్రామ శక్తులను ధ్వంసం చేయగా ప్రస్తుతం పోలేరమ్మను గ్రామానికి పశ్చిమంగా east ముఖంగా ప్రతిష్ష్టించారు. తర్వాత బ్రిటీషు కాలంలో కొందరు ప్రధానాలయానికి పక్కగా ఉన్న శివాలయంలోని శివలింగాన్ని తీసుకెళ్లి ప్రత్యేకంగా మందిరాన్ని నిర్మించుకున్నారు. (ఆ విధంగా విదేశీయులు విభజించు పాలించు అన్న తమసిద్ధాంతాన్ని మతసంబంధిత విషయాల్లో కూడా చక్కగా అమలుపరిచారు.)
అదేకాలంలో దివాన్ గావున్న శ్రీరాజా కాండ్రేగుల జోగిజగన్నాథరావు బహద్దూరు గారు (రాజమండ్రి), ఆ తర్వాత వాసిరెడ్ది వెంకటాద్రి నాయుడు గారులు ఆలయాన్ని పునరుద్ధరించారు.
మూలాలు, వనరులు[మార్చు]
- భావన్నారాయణస్వామి స్థల ప్రభావం - .శ్రీ నల్లూరి రంగాచార్యులు గారు
- భక్తి మాసపత్రిక
- స్థానికగాథలు