మదన్ సాహ్ని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదన్ సాహ్ని
మదన్ సాహ్ని


సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
16 ఆగష్టు 2022 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
నవంబర్ 2010 – 2015
నియోజకవర్గం బహదూర్ పూర్
పదవీ కాలం
2020 – ప్రస్తుతం
నియోజకవర్గం బహదూర్ పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-02-02) 1969 ఫిబ్రవరి 2 (వయసు 55)
బీహార్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (యునైటెడ్)
నివాసం పాట్నా, బీహార్, భారతదేశం
వృత్తి ఎమ్మెల్యే
వృత్తి రాజకీయ నాయకుడు

మదన్ సాహ్ని బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బహదూర్ పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]

రాజకీయ నాయకుడు[మార్చు]

మదన్ సాహ్ని పంచాయితీ సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆయన జిల్లా పరిషత్‌కు ఎన్నికై ఆ తరువాత జిల్లా బోర్డు ఛైర్మన్ ఎన్నికలో గెలిచాడు. ఆయన 2010లో తొలిసారి జనతా దళ్ (యునైటెడ్) అభ్యర్థిగా బహదూర్‌పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2015లో గౌర బౌరం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 20 నవంబర్ 2015న ఆహార & పౌరసరఫరాలు శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.

మదన్ సాహ్ని 2020 ఎన్నికల్లో బహదూర్‌పూర్ నియోజకవర్గం నుండి గెలిచి 9 ఫిబ్రవరి 2021 నుండి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.[2]

మూలాలు[మార్చు]

  1. Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
  2. Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.