Jump to content

మనసు ఫౌండేషన్

వికీపీడియా నుండి
మనసు ఫౌండేషన్
స్థాపన2006
రకంలాభాపేక్ష లేని సంస్థ
కార్యస్థానం
ఉత్పాదనsడిజిటలీకరణ
ముఖ్యమైన వ్యక్తులుమన్నం వెంకటరాయుడు, మన్నం గోపీచంద్, మన్నం చంద్రమౌళి.
ఉద్యోగులు25
జాలగూడుhttp://www.manasufoundation.com/

మనసు పౌండేషన్ తెలుగు భాషా, తెలుగు రాష్ట్రాలకు సంభందించిన సాహిత్యం, సినిమాలను డిజిటలీకరణ చేసే ఒక స్వచ్ఛంద సంస్థ. దీనిని ఎం.వి.రాయుడు, వారి సోదరులు మన్నం గోపీచంద్, మన్నం చంద్రమౌళి స్థాపించారు. తమ తల్లిదండ్రులు మన్నం నరసింహం, సుబ్బమ్మల పేర్లలో మ.న.సు. అన్న అక్షరాలు తీసుకుని పేరుపెట్టారు. మనసు ఫౌండేషన్ ప్రధానంగా తెలుగు పుస్తక ప్రచురణ, తెలుగు సాహిత్య డిజిటైజేషన్ రంగాల్లో పనిచేస్తోంది.

మన్నం వెంకటరాయుడు, మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరు

స్థాపన

[మార్చు]

మనసు అనేది వారి తల్లిదండ్రులపేరున అనగా మన్నం నరసింహం, సుబ్బమ్మ పేరున (మన్నం నుండి నరసింహరావు సుబ్బమ్మ నుండి సు) స్థాపించారు. దీని కార్యాలయం బెంగళూరులో 2006 లో ప్రారంబించారు. నెల్లూరు జిల్లా కనియంపాడు గ్రామం వద్ద 2018లో పుస్తకాల డిజిటలీకరణ కొరకు కేంద్రాన్ని ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు చేత స్ధాపించారు. సెప్టెంబరు 2023 వరకు కోటి నలబై లక్షల పేజీలను స్కాన్ చేసారు.[1] మనసు ఫౌండేషన్ డిజిటీకరణ కార్యకలాపాలు హైదరాబాద్, గుంటూరులతో పాటుగా వరికుంటపాడు మండలం కనియంపాడు గ్రామం కేంద్రంగా సాగిస్తున్నారు. దీనిని ముగ్గురు అన్నదమ్ములైన మన్నం వెంకట రాయుడు, డాక్టర్ మన్నం గోపీచంద్, మన్నం చంద్రమౌళిలు నడుపుతున్నారు.

కార్యక్రమాలు

[మార్చు]

పుస్తక ప్రచురణ రంగం

[మార్చు]

1. తెలుగు భాషను సుసంపన్నం చేసిన గొప్ప రచయితల సంపూర్ణ రచనల సర్వస్వాన్ని ప్రచురించి కొత్త తరం పాఠకులకు అందించడం.[2] ఆయా రచయితల రచనలు కాల గర్భంలో కలసిపోకుండా పరిరక్షించి భావి తరాలకి అందించడం. అలాగే ఒక రచయిత రచనల్ని ఒక చోటికి తీసుకు రావడం ద్వారా, ఆ రచయిత సాహిత్యం మీద పరిశీలన, పరిశోధన, విశ్లేషణ చేయదలచుకొన్న వారికి అందుబాటులో ఉంచడం. తద్వారా అయా రచనల పునర్ మూల్యాంకనానికి తోడ్పడటం. కాళీపట్నం రామారావు రచనలను, "చెప్పులు కుడుతూ కుడుతూ" అనే అనువాదాన్ని, విశాఖపట్నం ప్రజా గ్రంథాలయంలో ఆవిష్కరించారు.[3]

2. 19వ శతాబ్దానికి పూర్వం తెలుగు సమాజాన్ని ప్రతిఫలించిన రచనల్ని వెలుగులోకి తీసుకొని రావడం ఫౌండేషన్ రెండవ లక్ష్యం. ముఖ్యంగా ఆనాటి సమాజాన్ని చిత్రించిన, విశ్లేషించిన ఇంగ్లీషు రచనల్ని తెలుగులోకి తీసుకొని రావటం.

ఈ చిత్రపురి

[మార్చు]

"ఈ-చిత్రపురి" తెలుగు సినిమాకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సేకరించి తెలుగు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మొదలు పెట్టిన ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో భాగంగా తెలుగు సినిమా పాటల పుస్తకాలను, పత్రికలను, ఆడియోలను, వీడియోలను, ఛాయాచిత్రాలను సేకరించి, డిజిటీకరించే పనికి శ్రీకారం చుట్టింది. తెలుగులో అచ్చయిన పుస్తకాలను అందుబాటులో ఉన్నంత వరకు సేకరించి, కంప్యూటర్లలో భద్రపరచి భావితరాలకు అందించటం ఒక మహాయజ్ఞం. ఈ పని కోసం నెల్లూరు జిల్లా కనియంపాడు (వరికుంటపాడు మండలం) కేంద్రంగా మనసు ఫౌండేషన్ డిజిటైజేషన్ సెంటర్ ను నడుపుతోంది. ఇప్పటి వరకు పుస్తకాలు, పత్రికలు కలిపి దాదాపు 40 లక్షల పేజీల డిజిటీకరణ పూర్తయింది.

తెలుగులో అచ్చయిన లేదా చేతివ్రాత లో ఉన్న పుస్తకాలను మనసు ఫౌండేషన్ అందరినుండి సేకరించి, స్కానింగ్ కోసం తీసుకుని, వాటిని స్కాన్ చేసి తిరిగి యధాతథంగా తిరిగి వాపసు ఇస్తోంది.

పుస్తక ప్రచురణలు

[మార్చు]

సాహిత్య సర్వస్వాలు, సర్వలభ్య సంకలనాలు

[మార్చు]
  • పాతికేళ్ల తెలుగు కథ (2016)
  • పఠాభి రచనలు (2018)

అనువాదాలు

[మార్చు]
  • చెప్పులు కుడుతూ కుడుతూ (2008)
  • సర్ ఆర్థర్ కాటన్ జీవితం-కృషి (2011)

ఇతర రచనలు

[మార్చు]
  • మార్గదర్శి మన పంతులు గారు (2011)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Bureau, The Hindu (2023-09-22). "Call to preserve Telugu literary works for future generations". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-10-24. {{cite news}}: |last= has generic name (help)
  2. సీహెచ్., వేణు. "సాహిత్యంపై'మనసు'నిస్వార్థ తపస్సు". తెలుగు వెలుగు. Archived from the original on 2020-10-04. Retrieved 2020-10-04.
  3. "Two books released". The Hindu (in Indian English). 2010-02-12. ISSN 0971-751X. Retrieved 2024-10-24.