మల్లు సుబ్బారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్లు సుబ్బారెడ్డి, జననం:- 1908 పాణ్యం, మరణం:- 1968 డిసెంబరు 6, ఇతను రాజకీయవేత్త, న్యాయ వాది, నంద్యాల నియోజక వర్గ మొదటి ఎమ్మెల్యే, స్వాతంత్ర్య సమరయోధుడు.

మల్లు సుబ్బారెడ్డి 1908 వ సంవత్సరం పాణ్యం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మల్లు తిమ్మా రెడ్డి వ్యవసాయం చేసేవారు ఆయన తల్లి లక్ష్మమ్మ. మల్లు సుబ్బారెడ్డి యస్ యస్ ఎల్ సి వరకు నంద్యాల యస్ పి జి హై స్కూల్లో చదివి తరువాత ఇంటర్మీడియట్, డిగ్రీ అనంత పురం ఆర్ట్స్ కాలేజీలో తర్వాత లా డిగ్రీ మద్రాస్ లా కాలేజీ లో పూర్తి చేసి నంద్యాలలో న్యాయ వాది వృత్తి చేపట్టినారు.మల్లు సుబ్బా రెడ్డికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రులు నీలం సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య సహాధ్యాయులు.1941వ సంవత్సరములో బ్రిటీషు పరిపాలనకువ్యతిరేకముగా వ్యక్తిగత సత్యాగ్రహములో పాల్గొని మూడు నెలలు బళ్ళారి సెంట్రల్ జైలులో గడిపి తరువాత 1942వ సంవత్సరం నుండి 1944వ సంవత్సరం వరకు క్విట్ ఇండియా ఉద్యమములో పాల్గొని ఒకటిన్నర సంవత్సరములు వెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. 1952వ సంవత్సరములో స్వాతంత్ర్యము వచ్చిన తరువాత మొట్టమొదటి శాసనసభ ఎన్నికలలో మల్లు సుబ్బారెడ్డికి నంద్యాల నియోజకవర్గము కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1954వ సంవత్సరములో అప్పటి ముఖ్యమంత్రి అయిన ప్రకాశం పంతులు ప్రభుత్వము మద్యపాన నిషేధము ఎత్తివేయాలని ఓటింగు నిర్వహించారు. ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేనందున అప్పటి ఉపముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి మల్లు సుబ్బారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పినా మల్లు సుబ్బారెడ్డి ప్రభుత్వానికి అనుకూలముగా ఓటు వేయమని అడిగినా తిరస్కరించి మద్యపాన నిషేధము ఉండవలయునని ప్రభుత్వానికి వ్యతిరేకముగా ఓటువేయడముతో ఆ ఒక్కఓటుతో ప్రభుత్వము పడిపోయింది. మరలా 1955వ సంవత్సరములో ఎన్నికలు జరిగినాయి.మళ్ళీ 1962వ సంవత్సరములో నంద్యాల నియోజకవర్గము నుండి ఇండిపెండెంటు అభ్యర్థిగా పోటీ చేసి 1967వ సంవత్సరము వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు.

రాజకీయ ప్రస్థానం:-

1952 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొట్ట మొదటి శాసన సభ ఎన్నికలలో మల్లు సుబ్బా రెడ్డికి నంద్యాల నియోజక వర్గం కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.మళ్ళీ 1962 వ సంవత్సరంలో కూడా నంద్యాల నియోజక వర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 1967 వ సంవత్సరం వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. సుబ్బా రెడ్డి ప్రజలకు కులాలకతీతంగా సహాయాలను అందించిన మహోన్నత వ్యక్తిగా నిలిచారు. శాసనసభలో శాసన సభ్యుడు గా 1941వ సంవత్సరములో బ్రిటీషు పరిపాలనకువ్యతిరేకముగా వ్యక్తిగత సత్యాగ్రహములో పాల్గొని మూడు నెలలు బళ్ళారి సెంట్రల్ జైలులో గడిపి తరువాత 1942వ సంవత్సరం నుండి 1944వ సంవత్సరం వరకు క్విట్ ఇండియా ఉద్యమములో పాల్గొని ఒకటిన్నర సంవత్సరములు వెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. 1952వ సంవత్సరములో స్వాతంత్ర్యము వచ్చిన తరువాత మొట్టమొదటి శాసనసభ ఎన్నికలలో మల్లు సుబ్బారెడ్డికి నంద్యాల నియోజకవర్గము కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1954వ సంవత్సరములో అప్పటి ముఖ్యమంత్రి అయిన ప్రకాశం పంతులు ప్రభుత్వము మద్యపాన నిషేధము ఎత్తివేయాలని ఓటింగు నిర్వహించారు. ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేనందున అప్పటి ఉపముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి మల్లు సుబ్బారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పినా మల్లు సుబ్బారెడ్డి ప్రభుత్వానికి అనుకూలముగా ఓటు వేయమని అడిగినా తిరస్కరించి మద్యపాన నిషేధము ఉండవలయునని ప్రభుత్వానికి వ్యతిరేకముగా ఓటువేయడముతో ఆ ఒక్కఓటుతో ప్రభుత్వము పడిపోయింది. మరలా 1955వ సంవత్సరములో ఎన్నికలు జరిగినాయి.మళ్ళీ 1962వ సంవత్సరములో నంద్యాల నియోజకవర్గము నుండి ఇండిపెండెంటు అభ్యర్థిగా పోటీ చేసి 1967వ సంవత్సరము వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు.

కుటుంబం:-

మల్లు సుబ్బా రెడ్డికి ముగ్గురు సోదరులు, ఒక సోదరి, మొదటి సోదరుడు మల్లు తిమ్మా రెడ్డి ఇంగ్లాడులో బారిష్టర్ గా చదివి కర్నూలులో న్యాయ వాద వృత్తిని చేపట్టి నారు, రెండవ సోదరుడు మల్లు వెంకట రెడ్డి, పాణ్యం సర్పంచ్ గా 25 సంవత్సరాలు పనిచేశారు.మూడవ సోదరుడు మల్లు నారాయణ రెడ్డి వ్యవ సాయ శాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేశారు.

మరణం:-

రాజకీయాలంటే కేవలం సేవే గానీ, సంపాదన సంపాదన కాదని, నీతి నిజాయితీ లే ఆభరణాలనే సంకల్పంతో ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపి మల్లు సుబ్బా రెడ్డి ఆస్తమా వ్యాధితో 1968 డిసెంబరు 6 న మరణించారు.మల్లు సుబ్బా రెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, మల్లు సుబ్బా రెడ్డి కుమారుడు మల్లు రామ చంద్రా రెడ్డి 1985 సంవత్సరంలో నంద్యాల వ్యవా సాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పనిచేశారు.ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ మెడి సేవా డయాగ్నొస్టిక్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొన సాగుతున్నారు.