మాల (కులం)
![]() | ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మాల పద వ్యుత్పత్తి
[మార్చు]తెలుగు పర్యాయపద నిఘంటువు మాల అనే కులం మల్ల అనే పదం నుండి వచ్చింది.
మాలల చరిత్ర
[మార్చు]పల్లవుల కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ మల్లయుద్ధం శిక్షణ ఇచ్చి తరువాతి తరాలకు అందించటానికి విశేష కృషి చేశారు. దీన్ని మాలల స్వర్ణయుగ కాలంగా చెప్పవచ్చు , ఆ కాలంలో మల్లయుద్ధంలో వీరిని ఓడించేవారేలేరు , మనసులు మలినం పడిన రోజున ఓర్వలేని వారు చేసిన తప్పుల వలన అనగారిన వర్గాలు ఏర్పడడానికి దారితీసింది, అంతే కాదు అనచివేయబడకుంటే ఎక్కడ రాజ్యాధికారం చేపడతారో అనే భయంతో ఆర్థికంగా, అసమానతలతో ఉద్దేశ పూర్వకంగా అట్టడుగుకి తొక్కేసారు. లేకపోయుంటే వీరు రాజులుగా వెలుగొందేవారు. అదే సమయంలో చాలా కులాల వారిని అనచివేసి అనగారిన వర్గాలు ఏర్పడడానికి కారణం అయ్యారు. దీన్ని అపటి నుండి అలాగే కొనసాగిస్తూ వచ్చారు. అప్పుటి సమాజంలో ఈ నీచపు దురహంకారానికి చాలా వృత్తుల వారు బలయ్యారు. ఆ వృత్తులే కుల వృత్తులుగా మారాయి, ఇదే సమాజంలో అసమానతలు ఏర్పడడానికి దారితీసింది. చరిత్రలో ఒక్క ముస్లిం ప్రాంతంలో నేగాకుండా అన్ని ప్రాంతాలలో కూడా వారిని ఊరిబయట ఉంచి పాలేరులు గాను, తోట మాలిగాను పెట్టుకొని వారి శరీరదారుడ్యాన్ని శారరక శ్రమ కోసం ఈ సమాజం వాడుతూ వచ్చింది. శారీరిక బలవంతులై యుద్ధ కళల యందు నిష్ణాతులైన వీరి చేతికి రాజ్యాధికారం చిక్కితే అధికారం మరొకరు చేజిక్కించుకోవటం అసాధ్యమే అవుతుంది కనుక వీరిని దురుద్దేశ పూర్వకంగానే బలహీన సమాజంవారైనవారే ముందు జాగ్రత్తగా, తెలివిగా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లేకుండా చేసి, ఏదోఒక కారణంగా ఏదోఒక తప్పును అంటగడుతూ ఆ ఊరికి ఆ రాజ్యానికి వెన్నుదన్నుగా నిలిచిన వారిని ఏదో ఒక కుటి సాకులతో ఒక్కొకరినీ ఊరికి దూరంగా పంపుతూ వాళ్ళలో వాళ్ళకు సమైక్యత లేకుండా విభేదాలు స్రుష్టిస్తూ వర్గాలుగా విడగొట్టి తమ కోసం శారీరక శ్రమ చేయించుకోవడానికి మాత్రమే వినియోగించుకున్నారు, అంటే ఒక అల్పుడైన మావటి వాడు అన్నింటికన్నా బలమైన ఏనుగును గడ్డిపూచలుతో కట్టి ఉంచినట్లుగా, తరతరాలుగా ఇప్పటికీ ఇదే కొనసాగుతున్నది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయమేమిటంటే మాలలు బలమైన, అగ్రవర్ణాల వారు అనే విషయం చారిత్రక కారులకు, వారిని అణచివేతకు గురిచేసిన వర్ణాలవారికి వారి తరువాతి తరాలవారికి అంటే ఇప్పటి వారికీ తెలుసు కానీ ఈ మాలలలో మాత్రం అందరికీ ఈ విషయాలు తెలియక పోవడం, ఆవిషయం తెలిసిన మేధావులు ఇపుడున్న సమాజానికి ఈవిషయాన్ని తెలియజేయలేక పోవడం గమనార్హం. ఈ విషయాలను ఇపుడిపుడే తెలుసుకుంటున్న నవ సమాజానికి ఇదంతా నిజమేనా రాజ్య స్థాపన చేయగలిగే స్థాయి నుండి వివక్షకు గురయ్యే పరిస్థితికి దిగివచ్చిన విషయం నిజమా అనే పరిస్థితి ఉంది, అంటే గతంలో ఈ మల్లయోధల నైపుణ్యాలకు భయపడి భవిష్యత్ లో వీరు రాజరికానికి రాకూడదనే ఉద్దేశ పూర్వకంగా ఊరికి దూరంగా పెట్టిన వారి సంకల్పం ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతున్నట్లే కదా..
మంచి చెడ్డలు మనుజులందున
ఎంచి చూడగా రెండే కూలములు
మంచి అన్నది మాల అయితే మాల నేనగుదున్
అన్నారు గురజాడ అప్పారావు.
మాల-మాదిగల అనైక్యత
[మార్చు]కలదమ్మా వ్రణ మంటరానితన మాకర్ణింపుమీ యిండియా
పొలమందుం గల మాలమాదిగలకున్ భూతేశుడే కాదు కృ
ష్ణులు కృష్ణున్నిరసించు దైవములు క్రీస్తుల్ మస్తుగా బుట్టినన్
కలుపన్నేరరు రెండుజాతులను వక్కాణింప సిగ్గయ్యెడిన్ _ గుర్రం జాషువా
ప్రముఖులు
[మార్చు]1. బి.ఆర్. అంబేద్కర్ - రాజకీయవేత్త, ఆర్థికవేత్త, రాజ్యంగ నిర్మాత,
2. భాగ్యరెడ్డి వర్మ (భాగయ్య)
3. జి. వెకంట స్వామి (ఖాఖా),
4. గుమ్మడి విఠల్ రావ్( గద్దర్),
5. మల్లు భట్టివిక్రమార్క - రాజకీయవేత్త ( ప్రస్తుత తెలంగాణ ఉపముఖ్యమంత్రి)
6. మల్లు రవి - రాజకీయవేత్త,
7. గడ్డం వినోద్ కుమార్ - ఎంఎల్ఏ,
8. జి. వివేకానంద్ - ఎంఎల్ఏ,
9. గడ్డం వంశీకృష్ణ - ఎంపీ,
గృహనామాలు
[మార్చు]బొప్పని,
ఎడ్ల,
గుమ్మడి,
మల్లు,
గడ్డం,
పిండిగ
బైరు
ఏడిండ్ల
కాశమల్ల
నారమల్ల
వల్లమల్ల