వరుణ దేవాలయం, కరాచీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనోరా ద్వీపం తీరంలో ఉన్న వరుణ దేవాలయం

శ్రీ వరుణదేవ్ మందిర్ పాకిస్తాన్ దేశం లోని, సింధ్ రాష్ట్రంలో, కరాచీ పట్టణంలో మనోరా ద్వీపంలో ఉన్న దేవాలయం.ఈ దేవాలయం హిందూ పురాణాలలోని వరుణుడు ప్రధాన దైవంగా కలది[1]. ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించనది ఇతమిత్థంగా తెలియనప్పటికీ [2], ప్రస్తుతం ఉన్న నిర్మాణం 1917-18 సంవత్సరంలో నిర్మించినట్టుగా తెలుస్తున్నది [3]. తేమతో కూడిన సముద్రపు గాలుల వల్ల గుడి, గుడిపైన చిత్రించబడిన చిత్రాలు క్రమక్షయానికి గురవుతున్నాయి. ఈ భవనం 1950 నుండి దైవారాధనకు ఉపయోగించుటలేదు[4].

16వ శతాబ్దానికి చెందిన సంపన్న నౌకావ్యాపారి భోజోమల్ నాన్సీ భట్టియా మనోరా ద్వీపాన్ని కొనుగోలు చేసాడు. అతని కుటుంబీకులు, ఈ ద్వీపంలోని దేవాలయాన్ని బాగోగులు చూస్తూ ఉండేవారు. ప్రస్తుతం, ఈ ఆలయం పాకిస్తాన్ హిందూ పరిషత్ (హిందూ కౌన్సిల్ ఆఫ్ పాకిస్తాన్) ఆధ్వర్యంలో ఉన్నది[5] .

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]