ప్రణీత వర్థినేని

వికీపీడియా నుండి
(వర్ధినేని ప్రణీత నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ప్రణీత వర్ధినేని
జననం
పర్వతగిరి, వరంగల్, తెలంగాణ
జాతీయతభారతీయురాలు
వృత్తిఆర్చరీ క్రీడాకారిణి

ప్రణీత వర్థినేని (జననం 1990 నవంబరు 17) అర్చెరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి. బీజింగ్లో జరిగిన 2008 ఒలింపిక్ క్రీడలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది.

బాల్యం[మార్చు]

1990, నవంబర్ 17న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామంలో ఆమె జన్మించింది.

2008 ఒలింపిక్ క్రీడలు[మార్చు]

2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో ప్రణీత వర్థినేని మహిళ అర్చెరీ వ్యక్తిగత, టీం విభాగాలలో ప్రాతినిధ్యం వహించింది. వ్యక్తిగత విభాగంలో రౌండ్ 64లో ఆస్ట్రేలియాకు చెందిన జానె వాల్లెర్‌పై 106-100 స్కోరుతో విజయం సాధించి రౌండ్ 32కు వెళ్ళిననూ, అందులో ఉత్తర కొరియాకు చెందిన కోన్ ఉన్ సిల్ తో 99-106 తేడాతో ఓడి చివరకు 37వ స్థానం పొందినది..[1] టీం విభాగంలో డోలా బెనర్జీ, బాంబ్యాలాదేవిలతో కలిసి పోటీపడిన ప్రణీత వర్థినేని క్వార్టర్ ఫైనల్లో చైనాతో ఒడిపోయి చివరకు 6వ స్థానం పొందింది.

మూలాలు[మార్చు]

  1. Athlete biography: Pranitha Vardhineni, beijing2008.cn, ret: August 23, 2008