వాడుకరి:నాగిశెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కవి;రచయిత. పూర్తి పేరు నాగిశెట్టి తాతయ్య నాయుడు.ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు గా గత రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. ఆచార్య ఎన్.గోపి గారి స్పూర్తితో నానీ ప్రక్రియను అందిపుచ్చుకుని నానీ లను రాయడం లో విశిష్ట గుర్తింపు ను పొందారు. మూడు నానీల సంపుటాలను రచించారు.వీరి నానీల సంపుటాలు గడ్డిచేమంతులు,మనిషి కోసం, నాగిశెట్టి నానీలు.వీరు రచించిన నానీలు నాగిశెట్టి నానీలు గా సాహితీ లోకం లో బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి.వీరు రచించిన మట్టి బంగారం వచన కవితా సంపుటి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.వీరి జన్మ స్థలం గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆరేపల్లి శివారు ప్రసాదం వారి పాలెం.రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు నానీల సంపుటాలను వెలువరించిన అతి కొద్ది మంది లో నాగిశెట్టి ఒకరు.

ఈయన రచించిన ఎడారి లో మంచుకొండ‌,పైపంచె జారింది, వెలుగు నీడలు,ఎండమావి, డెడ్ లైన్ వంటి కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడి గుర్తింపు ను తెచ్చి పెట్టాయి.నానీల కవులు