వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 34వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లా తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలలో ఒకటి. 1978లో హైదరబాదు జిల్లా నుంచి విడదీసి దీన్ని ఏర్పాటుచేశారు. హైదరాబాదు జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉన్నది. హైదరాబాదు నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రముగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 52,96,741 జనాభాతో ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి, దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, విమోచనోద్యమకారులు కాటం లక్ష్మీనారాయణ, వెదిరె రాంచంద్రారెడ్డి, గంగారాం ఆర్య, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. శ్రీరామునిచే ప్రతిష్టించబడిన కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు, షాబాద్ నాపరాతికి, సిమెంటు కర్మాగారాలకు మరియు కందులకు ప్రఖ్యాతిగాంచిన తాండూరు ఈ జిల్లాలోనివే. జిల్లాలో 37 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదుకు చెందిన 150 డివిజన్లలో 48 డివిజన్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నది మూసీ.

(ఇంకా…)