వై.ఎస్. రాజారెడ్డి స్టేడియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వై.ఎస్. రాజారెడ్డి స్టేడియం
వై.ఎస్. రాజారెడ్డి స్టేడియం
Full nameవై.ఎస్. రాజారెడ్డి స్టేడియం
Locationకడప, ఆంధ్రప్రదేశ్
Ownerకడప మ్యునిసిపల్ కార్పొరేషన్
Operatorఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
Capacity15,000 [1]
Opened2011
Tenants
ఆంధ్ర క్రికెట్ టీం
Website
Cricinfo

వై.ఎస్. రాజా రెడ్డి క్రికెట్ స్టేడియం ఆంధ్ర ప్రదేశ్ లోని కడపలో ఉన్న ఒక క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియం  కడప నగరం నడిబొడ్డు నుండి 10 కి.మీ. దూరంలోని పుట్లంపల్లి గ్రామమ్లో ఉంది. ఇది రూ.8 కోట్ల వ్యయంతో 10.50 ఎకరాల స్థలంలో 15,000 మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మించబడినది. [2] [3]

ఈ మైదానంలో ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు నిర్వహించడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ మైదానం 85-గజాల బౌండరీని కలిగి ఉంది. వై.ఎస్. రాజా రెడ్డి- ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో నిర్మించబడినది. ఈ స్టేడియం కోసం రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. వివిధ సౌకర్యాలతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ యొక్క రెసిడెన్షియల్ అకాడమీ కూడా ఉంది. [4] [5]

మూలాలు[మార్చు]

  1. "World Stadium". Archived from the original on 2011-09-24. Retrieved 2023-08-19.
  2. Subramanyam, M. V. (6 November 2011). "Dream come true for Kadapa cricket lovers". The Hindu. Retrieved 31 January 2019.
  3. TV9
  4. GreatAndhara
  5. "Andhra Cricket Association". Archived from the original on 2018-07-20. Retrieved 2023-08-19.