సంతోష్ కుమార్ మిత్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంతోష్ కుమార్ మిత్రా
జననం1900 ఆగష్టు 15
సెంట్రల్ కలకత్తా, బ్రిటిష్ ఇండియా]]
(ఇప్పుడు కోల్‌కతా
మరణం1931 సెప్టెంబరు 16
హిజ్లీ నిర్బంధ శిబిరం, బ్రిటిష్ ఇండియా
(ఇప్పుడు భారతదేశంలో)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత స్వాతంత్ర్య పోరాటంలో పాత్రకలిగిన వ్యక్తి
జీవిత భాగస్వామిజ్యోత్స్న మిత్ర
తల్లిదండ్రులు
  • దుర్గా చరణ్ మిత్ర (తండ్రి)

సంతోష్ కుమార్ మిత్రా, (బెంగాలీ: Bengali কুমার ) లేదా సంతోష్ మిత్రా (1900 ఆగస్టు 15 - 1931 సెప్టెంబరు 16) భారత స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త, అమరవీరుడు. అతను కోలకతా , బౌబజార్ ప్రాంతంలోని 9 సి హాలా ధర్ బర్ధన్ లేన్ తన పూర్వీకుల ఇంట్లో జన్మించాడు.అతను ఒక తెలివైన విద్యార్థి. అతను కార్మికుడు, రైతు పార్టీ సభ్యుడు

జీవితం తొలిదశ[మార్చు]

మిత్రా 1900 ఆగస్టు 15న కోలకతా లోని ఒకమధ్య తరగతి కాయస్థ కుటుంబంలో జన్మించాడు. అతను 1915 లో కోల్‌కతాలోని హిందూ ఫాఠశాల నుండి మెట్రిక్యులేషన్ పాసయ్యాడు.1919 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయ్యాడు. 1921–22 కాలంలో అతను ఎంఎ, ఎల్.ఎల్.బి.కోర్సులు పూర్తి చేశాడు.[1] నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతని సహచర విద్యార్థి.[2]

విప్లవాత్మక కార్యకలాపాలు[మార్చు]

మిత్రా అర్థసరీరాకృతి చిత్రం
సంతోష్ కుమార్ మిత్ర అమరవీరుడుగా తెలిపే ఫలకం

సంతోష్ మిత్రా భారత జాతీయ కాంగ్రెస్ చేరాడు. అతను స్వరాజ్ సేవక్ సంఘాన్ని స్థాపించాడు. 1922 లో జుగంతర్ నాయకులలో ఒకరైన భూపతి మజుందార్, గౌర్హరి షోమ్, నాగెన్ ముఖర్జీ నేతృత్వం లోని హుగ్లీ విద్యామందిర్‌లో చేరాడు.కాంగ్రెస్ పార్టీకి విద్యా మందిరం కార్యకలాపాల ప్రధాన కేంద్రం. అతను జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన కోల్‌కతాలో సోషలిస్ట్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేసిన తరువాత, మిత్రా స్వాతంత్ర్య పోరాటంలో తీవ్రవాద ఉద్యమానికి మారాడు. ఆ సమయంలో సెంట్రల్ కోల్‌కతా బిపిన్ బిహారీ గంగూలీ నాయకత్వంలో నిర్వహించిన తీవ్రవాద స్వాతంత్ర్య పోరాట ఉద్యమానికి డెన్‌గా మారింది. అతను శంఖరితోలా హత్య కేసులో అభియోగాలు మోపబడ్డాడు. 1923లో దాని కారణంగా అరెస్టు అయ్యాడు. [1] [3]

1924 లో అతను అలిపూర్ కుట్ర కేసులో అరెస్టు చేయబడ్డాడు. ఒక సంవత్సరం తరువాత అతను నిర్దోషిగా ప్రకటించబడ్డాడు.కానీ 1818 చట్టం ఆర్టికల్ 3 ప్రకారం అతడిని నిర్బంధించారు. 1927 లో అతను విడుదలయ్యాడు.జైలులో ఉన్నప్పుడు, మిత్రా తన మాస్టర్స్ పూర్తి చేసి లా పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.[2]

1930 చారిత్రక చటోగ్రామ్ ఆస్ట్రాగర్ లుంతన్ లేదా చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ సంవత్సరం. ఈ కేసులో పరారీలో ఉన్న కొందరు నిందితులైన గణేష్ ఘోష్, అంబికచరణ్ చక్రవర్తి, అనంత ఘోష్‌తో మిత్రను మళ్లీ బంధించి 1930 లో హిజలీ జైలుకు పంపారు.1931 సెప్టెంబరు 16న హిజ్లీ కాల్పులు జరిగాయి. ఆ కాల్పులలో సంతోష్ కుమార్‌ మరణించాడు. మిత్ర. హిజ్లీ కాల్పులు బెంగాల్‌లో గొప్ప గందరగోళాన్ని సృష్టించాయి. అమరవీరుల గౌరవంతో మృతదేహాలను కోల్‌కతాకు తీసుకువచ్చారు. మృతదేహాలను కియోరతోలా శ్మశానవాటికలో దహనం చేశారు. ఈ హత్యకు వ్యతిరేకంగా సెప్టెంబరు 19 న కోల్‌కతాలో సార్వత్రిక సమ్మె జరిగింది. సెప్టెంబరు 26 న ఓక్టెర్లోని స్మారక చిహ్నంలో (ప్రస్తుత షాహిద్ మినార్) నిరసన సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి రవీంద్రనాథ్ ఠాగూర్ అధ్యక్షుడిగా ఉన్నాడు. తన "కవచం" కవిత ద్వారా ఠాగూర్ తన భావాలను, కోపాన్ని వ్యక్తం చేశాడు.బ్రిటిష్ ప్రభుత్వం జస్టిస్ ఎస్.సి. మౌల్లిక్, డర్మోండ్, ఐసిఎస్, జిల్లా మేజిస్ట్రేట్ తో డిపార్ట్‌మెంటల్ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సిపో ప్రవర్తనను కమిషన్ ఖండించింది.[2]

మరణం[మార్చు]

1931 సెప్టెంబరు 16న, హిజ్లీ నిర్బంధ శిబిరంలో సంతోష్ కుమార్ మిత్రాను, మరో ఖైదీ తారకేశ్వర్ సేన్‌గుప్తాలను పోలీసులు కాల్చి చంపారు.[4] [5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Part I, Arun Chandra Guha. Indias Struggle Quarter of Century 1921 to 1946. ISBN 9788123022741. Retrieved 22 November 2017.
  2. 2.0 2.1 2.2 "Who was Santosh Mitra? Tracing the lane where he was born". Get Bengal. Retrieved 2021-09-26.
  3. Vol - I, Subodh S. Sengupta & Anjali Basu (2002). Sansad Bangali Charitavidhan (Bengali). Kolkata: Sahitya Sansad. p. 559.
  4. "IIT-Kharagpur remembers its Hijli Jail days". financialexpress.com. Retrieved 22 November 2017.
  5. Jana, Naresh (11 September 2002). "IIT revival pill for historic Hijli Jail". Retrieved 10 June 2018.

వెలుపలి లంకెలు[మార్చు]