సత్యనారాయణ పురం (బయ్యారం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సత్యనారాయణపురం ఖమ్మం జిల్లా, బయ్యారం మండలంలోని గ్రామం.[1]. సా.శ 13 వ శతాబ్దంలో ఈ గ్రామం నిర్మించబడినది అనేందుకు కొన్ని ఆధారాలు ఈవూరి పొలిమేరల్లో ఉన్నాయి. కాకతీయ చక్రవర్తి అయిన గణపతిదేవుడు పరిపాలనాకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సామంతరాజు భార్య ఐన మైలమాంబ కు, కట్న కానుకలుగా ఈ ప్రాంతాన్ని ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి.

సత్యనారాయణ పురం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం బయ్యారం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ప్రస్తుత బయ్యారం చెరువు (మైలసముద్రము అనీ అంటారు) అలుగుల వృథానీరు అలిగేరు అనే చిన్న నది ద్వారా క్రిష్ణలో కలుస్తుంది. ఈ నది పరీవాహకప్రాంతములో ఉన్న ఈ గ్రామం, ముక్కారు పంటలతో సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది. ఖమ్మం జిల్లాలో ఉత్తమ గ్రామంగా దీనిని తీర్చిదిద్దారు.

  • ఈ గ్రామములో శ్రీమతి నాదెళ్ళ కమలమ్మ అను ఒక స్వాతంత్ర్య సమరయోధురాలు ఉన్నారు. ఈమె తెలంగాణా విముక్తిపోరాటంలో, చురుకైన పోరాటంచేశారు. స్వాతంత్ర్య సమరయోధురాలిగా ప్రజల మన్ననలను పొందారు. ఈమె తన 93 వ ఏట, జనవరి-2/2014 న కాలధర్మం చెందినారు. [1]

[1] ఈనాడు ఖమ్మం; జనవరి-3,2014;7వ పేజీ.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-08.