హర్దేకర్ మంజప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హర్దేకర్ మంజప్ప (1886-1947) కర్ణాటక రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత, పాత్రికేయుడు.[1]

ప్రారంభ జీవితం, విద్య[మార్చు]

మంజప్ప ఉత్తర కర్ణాటకలోని బనవాసి అనే ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అతను సమీపంలోని సిరిసి పట్టణంలో చదువుకున్నాడు. ప్రాథమిక విద్యను 1903లో పూర్తి చేశాడు. నెలకు ఏడు రూపాయల జీతంతో ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు.[2]

ఉద్యమంలో[మార్చు]

మంజప్ప, అతని సోదరుడితో కలిసి స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నాడు. అతను సెయింట్-రిఫార్మిసిస్ట్ బసవ మాటలకు ఆకర్షితుడయ్యాడు. మంజప్ప అనేక పుస్తకాలను వ్రాసాడు. 1913 లో, అతను బసవ జయంతిని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించాడు.[3]

1927 లో ఆల్మట్టిలో మంజప్ప ఒక ఆశ్రమ పాఠశాలను ప్రారంభించాడు. గాంధీజీ నిర్మాణాత్మక పనుల గురించి అవగాహన కల్పించడానికి ఉత్తర కర్ణాటకలోని గ్రామాల్లో పర్యటించాడు. బసవన్న, గాంధీ బోధనల మధ్య అనేక సారూప్యతలను అతను గ్రహించాడు. ఈ ఉపదేశాలను బహిరంగ ప్రసంగాలలో సులభంగా అర్థమయ్యే భాషలో వ్యక్తీకరించడంలో మంజప్ప ప్రయత్నం చేశాడు.

ఇతర విషయాలు[మార్చు]

  • మంజప్ప సత్యాగ్రహం, దేశభక్తి, జాతీయత వంటి అంశాలపై వెయ్యికి పైగా ఉపన్యాసాలు ఇచ్చాడు.
  • 1924లో తన బృందం 'బసవేశ్వర సేవా దళ' సహాయంతో బెల్గాంలో కాంగ్రెస్ పార్టీ సెషన్ నిర్వహించాడు.
  • మంజప్ప బసవన్నపై ఒక పుస్తకాన్ని రాసి గాంధీకి అందించాడు.
  • మంజప్ప "గాంధీ ఆఫ్ కర్ణాటక"గా ప్రసిద్ధి చెందాడు.
  • మంజప్ప తన ఆత్మకథతో సహా 40 కి పైగా పుస్తకాలు రాశాడు.[4]

మరణం[మార్చు]

మంజప్ప 3 జనవరి 1947 న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. Amaresh Datta, ed. (1988). Encyclopaedia of Indian Literature. Vol. 2. Sahitya Akademi. p. 1542. ISBN 9788126011940.
  2. [1]
  3. "Kamat's Potpourri: Amma's Column - Gandhi of Karnataka - Hardekar Manjappa". Kamat.com. Retrieved 2016-09-29.
  4. Special correspondent (January 1, 2008). "Seminar on Hardekar Manjappa's life". The Hindu. Retrieved 2016-09-29.