కిక్రి (వాయిద్యం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది గోండు సమాజంలో బహుళ ప్రచారంలో ఉన్న వాద్యం. గోండుల ఉపకులం అయిన ప్రధాన్లు దీనిని వాయిస్తూ గోండి తెగ గాథలను పాడుతుంటారు. దీనిని ప్రధాన్ల ధర్మ గురువు హీరసుక్కు వాద్యంగా పేర్కొంటారు. దీనిని హీరబాయి కిక్రి (కింగ్రి) అని కూడా అంటారు.[1]

తయారీ[మార్చు]

చెట్టు కాండం తొలచి జానెడున్నర పొడవు గల చతురస్రాకారపు అనునాదకం తయారు చేస్తారు. దానిపై మేక చర్మం అమరుస్తారు. దాని మధ్యలో వెదురు బొంగుని జొప్పిస్తారు. రెండోవైపు దీనికి మూడు రంధ్రాలుచేసి శృతి కర్రలు అమర్చుతారు. వీటిని పూటీలు అంటారు. పెట్టెను వాద్యకారుడు తన గడ్డంతో అదిమిపట్టుకుని కింది వైపున్న పూటీలపై వయోలిన్ వాయించినట్లుగా భోమ్తో వాయిస్తారు. ఈ ఖోమ్ విల్లులాగా ఉంటుంది. దీనికి గజ్జెలు కట్టి ఉంటాయి. వింటితో వాయించేప్పుడు గజ్జెలు ఆయా రాగాలకు అనుగుణంగా ధ్వనిస్తుంటాయి.[2]

వివిధ వాద్యాలతో పోలిక[మార్చు]

కిక్రి  వాద్యానికి మణిపూర్లో "పేనా, ఒరిస్సాలో కెన్రా  'బాణం', రాజస్థాన్లో రావణహట్టా, కేరళలో 'వీణాకుంజు వాద్యానికి  పోలిక ఉంది. కాని గోండీ గాన సంప్రదాయ విశిష్టత కూడా కిర్రీ వాద్యానికి ప్రత్యేకత తెచ్చి పెట్టింది. గోండి తెర ఆదివాసులు నివసించే 6,7 రాష్ట్రాలలో ఈ వాద్యం ఉండేది. ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో గల గోండీ ప్రజలు కిక్రి ని  వాడుతున్నారు.

సామూహికంగా వాయిస్తారు[మార్చు]

గోండీ  పూజారులైన ప్రధాన్లు తమ తెగ ఆచారాన్ని పాటిస్తూ జరిపే మత క్రతువుల్లోను, కర్మకాండలలోను, పెళ్ళిళ్ళు, చావులు ఉత్సవాలలోను దీనిని వాయిస్తున్నారు. గోండి సంప్రదాయాలకు, గౌరవానికి ఇది సంకేతం. కిక్రితో పాటు 'పెప్రే ' అనే రెండు సన్నాయి వాద్యాలు, డక్కి అనే చర్మవాద్యం అన్నీ కలిసి సామూహికంగా వాయిస్తారు.

మూలాలు[మార్చు]

  1. మూర్తి, మిక్కిలినేని రాధాకృష్ణ. "తెలుగువారి జానపద కళారూపాలు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2022-04-02.
  2. జయధీర్, తిరుమలరావు; గూడూరి, మనోజ (2019). మూలధ్వని (జానపద గిరిజన సంగీత వాద్యాల సామజిక చరిత్ర ).