గోన గన్నారెడ్డి (నవల): కూర్పుల మధ్య తేడాలు
ట్యాగు: 2017 source edit |
ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
== కథా సారాంశము == |
== కథా సారాంశము == |
||
కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురానికి రాజు గోన లకుమయా రెడ్డి. అతని కొడుకు గోన వరదారెడ్డి. వరదారెడ్డికి మరో కాకతీయ సామంత రాజ్యమైన ఆదవోని రాజు కోటా రెడ్డి |
కాకతీయ సామ్రాజ్య చక్రవర్తియైన గణపతి దేవునికి కుమార్తె కలుగుతుంది. రాజ్యక్షేమాన్ని కాంక్షించి తన ప్రధామ మంత్రియైన శివదేవయ్య సలహాను అనుసరించి ఆమెను రుద్రదేవుడనే పేరుతో లోకానికి పరిచయం చేస్తాడు గణపతి దేవుడు. కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురానికి రాజు గోన లకుమయా రెడ్డి. అతని కొడుకు గోన వరదారెడ్డి. వరదారెడ్డికి మరో కాకతీయ సామంత రాజ్యమైన ఆదవోని రాజు కోటా రెడ్డి కుమార్తె అన్నాంబికను ఇచ్చి వివాహం చేయాలనుకుంటూ ఉంటారు. ఇంతలో గజదొంగయైన గోన గన్నారెడ్డి వచ్చి వరదారెడ్డిని అపహరిస్తాడు. దాంతో ఆ వివాహం చెడిపోతుంది. |
||
== ముఖ్య పాత్రలు == |
== ముఖ్య పాత్రలు == |
11:50, 13 జూన్ 2019 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గోన గన్నారెడ్డి నవలను అడవి బాపిరాజు రచించారు. ఇది కాకతీయ చారిత్రాత్మక నవల.[1] గోనగన్నా రెడ్డి ఆంధ్ర సామ్రాట్టు కాకతీయ గణపతిదేవుని కుమార్తె అయిన రుద్రమదేవికి కుడిభుజంగా ఉంటూ పశ్చిమాంధ్ర భూమిని ఏలుతూ ఉండేవాడు. గన్నారెడ్డి కుమారుడు గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనే ద్విపద కావ్యం రచించాడు. దీనిని మొదటి సారిగా 1946లో మచిలీపట్టణానికి చెందిన త్రివేణి పబ్లిషర్సు వారు ప్రచురించారు. ఈ పుస్తకం కొండగడప జాగీర్దారు రాజా అక్కినేపల్లి జానకిరామారావుకు అంకితం చేయబడింది.
కథా సారాంశము
కాకతీయ సామ్రాజ్య చక్రవర్తియైన గణపతి దేవునికి కుమార్తె కలుగుతుంది. రాజ్యక్షేమాన్ని కాంక్షించి తన ప్రధామ మంత్రియైన శివదేవయ్య సలహాను అనుసరించి ఆమెను రుద్రదేవుడనే పేరుతో లోకానికి పరిచయం చేస్తాడు గణపతి దేవుడు. కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురానికి రాజు గోన లకుమయా రెడ్డి. అతని కొడుకు గోన వరదారెడ్డి. వరదారెడ్డికి మరో కాకతీయ సామంత రాజ్యమైన ఆదవోని రాజు కోటా రెడ్డి కుమార్తె అన్నాంబికను ఇచ్చి వివాహం చేయాలనుకుంటూ ఉంటారు. ఇంతలో గజదొంగయైన గోన గన్నారెడ్డి వచ్చి వరదారెడ్డిని అపహరిస్తాడు. దాంతో ఆ వివాహం చెడిపోతుంది.
ముఖ్య పాత్రలు
- రుద్రమ దేవి, కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి, తండ్రి గణపతి దేవుని తర్వాత చక్రవర్తిత్వాన్ని వారసత్వంగా పొందుతుంది.
- గణపతి దేవుడు, రుద్రమ దేవి తండ్రి, కాకతీయ వంశపు అష్టమ చక్రవర్తి
- గోన గన్నారెడ్డి, కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురం రాజైన గోన బుద్ధా రెడ్డి పెద్ద కొడుకు
- శివ దేవయ్య, కాకతీయ సామ్రాజ్య మంత్రి
- ప్రసాదాదిత్య నాయుడు
- జాయప సేనాని
- కోటారెడ్డి, ఆదవోని రాజ్య ప్రభువు
- అన్నాంబిక, కోటారెడ్డి కుమార్తె
- కుప్పాంబిక, గన్నారెడ్డి అక్క
- అక్కిన ప్రగడ, కాకతీయ మంత్రి
- చిన అక్కిన ప్రగడ, పెద అక్కినప్రగడ మనుమడు, గోన గన్నారెడ్డి మంత్రి
- ముమ్ముడాంబిక, జాయప సేనాని కుమార్తె; రుద్రమదేవి వనిత అని లోకానికి పూర్తిగా తెలియక మునుపు ఈమెను ఇచ్చి వివాహం చేస్తారు.
- మహాదేవరాజు, దేవగిరి యాదవరాజు, కాకతీయ సాంరాజ్యంపై పెద్ద ఎత్తున దండయాత్ర చేసి చివరికి ఓటమి పాలవుతాడు.
- గోన లకుమయా రెడ్డి, గోన గన్నారెడ్డి పినతండ్రి, గన్నారెడ్డి తండ్రి బుద్ధారెడ్డి తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్టించిన వాడు
- మురారి దేవులు
- హరిహర దేవులు
- గోన వరదారెడ్డి, గోన లకుమయారెడ్డి తమ్ముడు
- విఠల ధరణీశుడు, గన్నారెడ్డి తమ్ముడు, అతనికి కుడిభుజం, భీమబలుడు.
- సోమనాథాచార్యుడు, శివదేవయ్య ఆంతరంగిక చారుడు
- జన్నిగదేవుడు
- కోట పేర్మాడిరాయడు, గణపతి దేవుడి అల్లుడైన కోట భేతమహారాజులమీద దండెత్తి గన్నయ్య చేతిలో పరాభవం పొందుతాడు.
- సూరన రెడ్డి, గన్నారెడ్డికి ఎడమ భుజం లాంటివాడు