బెల్లంకొండ సురేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెల్లంకొండ సురేష్ రెడ్డి
జననం (1965-12-05) 1965 డిసెంబరు 5 (వయసు 58)
వృత్తిచలనచిత్ర నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
జీవిత భాగస్వామిబెల్లంకొండ పద్మావతి
పిల్లలుబెల్లంకొండ శ్రీనివాస్
బెల్లంకొండ గణేష్ బాబు

బెల్లంకొండ సురేష్ ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు పొందారు.

జీవిత చరిత్ర[మార్చు]

బెల్లంకొండ సురేష్ సతీమణి పద్మావతి. వీరికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ బాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ 2014లో అల్లుడు శీనుతో అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఆయన రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాత. కాగా 2022లో స్వాతిముత్యం సినిమాతో ఆయన హీరోగా పరిచయం కాబోతోన్నాడు.

వివాదం[మార్చు]

టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 2004 జూన్ 3న జరిగిన కాల్పుల ఘటనలో ఉన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్, అతని అసోసియేట్ సత్యనారాయణ చౌదరిపై నటుడు కాల్పులు జరిపాడు. అనంతరం క్షతగాత్రులిద్దరినీ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.[1] ఈ కేసు విచారణ, దానిని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ప్రశ్నించడం లాంటివి అప్పట్లో చాలా వివాదానికి దారితీశాయి.[2]

మూలాలు[మార్చు]

  1. "Actor 'fires at' producer". The Hindu. Chennai, India. 4 June 2004. Archived from the original on 13 August 2004. Retrieved 4 June 2004.
  2. "Delay in action against Balakrishna deplored". The Hindu. Archived from the original on 25 June 2008. Retrieved 19 June 2004.{{cite web}}: CS1 maint: unfit URL (link)