వికలాంగుల హక్కుల పొరాట సమితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వి.హెచ్. పి. ఎస్ ) 28.08.2007 నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిర్భవించింది. ఇది ఒక గొప్ప చారిత్రాత్మక రోజుగా చెప్పవచ్చు ఎందుకుంటే తరతరాలుగా అనేక అణచివేతలను, సామాజిక వివక్షతలను ఎదుర్కొంటూ జీవితాలను కొనసాగిస్తున్న వారికి రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని, అంతేకాక ఆవర్గాలకు రావల్సినంతగా సంక్షేమ వాటా కేటాయించకుండా మరుగున పెట్టించే ప్రయత్నం గత ప్రభుత్వాలు చెయ్యడం జరిగింది. అలాంటి సమస్యలు అదిగమించేందుకు వికలాంగులకు ప్రజాస్వామికమైన పద్ధతిలో ఒక సంఘం అవసరం అని భావించిన సామజిక ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగ నిర్ణయం ప్రకారం వికలాంగుల హక్కుల పోరాట సమితి (వి. హెచ్. పి. ఎస్) బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిర్భవించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రదానంగా రాష్ట్రంలో వివిధ రూపాలలో ఉన్న వికలాంగుల సంఘాల నాయకులు పాల్గొని వాళ్ళ సంక్షేమానికి సంబంధించి తీర్మానాలు, డిమాండ్స్ ప్రవేశపెట్టారు అంతేకాక ఉద్యమ నిర్మాణం పై ఏవిదమైన ఉద్యమం నిర్మించాలి ఎవరి సహాయం తీసుకోవాలి అనేదానిపై చర్చ, అందులో అప్పటికే మాదిగ దండోరా ప్రతి గ్రామం నుండి మొదలుకొని రాష్ట్ర మొత్తం వ్యాపించి ఉండటం వాళ్ళ మాదిగ దండోరా, దండోరా కార్యకర్తలే ఉద్యమానికి పూర్తి సైనికులుగా పనిలో ముందుంటారని తీర్మానం చెయ్యటం జరిగింది. దానితో పలు వికలంగులలో ఉన్న వివిధ విభాగాల నుండి కూడా కమిటీ లలో ప్రాతినిధ్యం తీసుకొని ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో చాలా మంది వికలాంగులు హైదరాబాద్ లోనే హాస్టల్ విద్యార్థులుగా ఉండే వాళ్ళు ప్రధాన నాయకత్వంలో ముందు వరుసలో ఉన్నారు. అంతే కాక ఇందులో మహిళా వికలాంగుల విభాగం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

బహిరంగ సభ[మార్చు]

రాష్ట్రంలో ఉన్న అన్ని 23 జిల్లాలలో వికలాంగుల హక్కుల పోరాట సమితి కమిటీలు వేసి దానితో పాటు రా ష్ట్రం లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను నిర్వహించుటకు గాను అన్నిగ్రామాల నుండి మొదలుకొని రాష్ట్రంలో బలమైన ఉద్యమ నాయకత్వం నిర్మించడంలో మాదిగ దండోరా పాత్ర చాల గొప్పది. నిజాం కాలేజీలో నిర్వహించిన సభ చాలా ఉన్నతమైనది. ఈ సభను అడ్డుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టించి ఇబ్బందులకు గురిచేసే ఆలోచనలో ఉంటే మంద కృష్ణ మాదిగ దృఢసంకల్పంతో కుట్రల్ని భగ్నం చేసి, ప్రపంచానికి ఆదర్శ ఉద్యమంగా నిలబెట్టారు.