ఐశ్వర్యా రాయ్
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము లేదా వ్యాస విభాగము ఐశ్వర్య రాయ్ తో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి) |
కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు నగరానికి చెందిన ఐశ్వర్యా రాయ్ (Aishwarya Roy) 1972లో జన్మించింది. 1994లో ప్రపంచ సుందరి కిరీటం నెగ్గటం ద్వారా భారత దేశమంతటా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. 1996లో మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువర్ తమిళ చిత్రం (ఇది తెలుగులో ఇద్దరు అనే పేరుతో విడుదల అయ్యింది.) ద్వారా ఈమె సినీరంగంలోకి ప్రవేశించింది. 1997లో జీన్స్ అనే మరో తమిళ చిత్రంలో కూడా నటించింది. ఆ తరువాత ఈమె హిందీ చిత్రాలకే పరిమితమైపోయింది. తెలుగులో ఈమె కనిపించిన ఒకే ఒక చిత్రం రావోయి చందమామా. ఆ చిత్రంలో ఈమె నాగార్జున సరసన ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది. ఈమె అభిషేక్ బచ్చన్ ని పెళ్ళిచేసుకొని, అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కోడలయింది.