కందుకూరి రాజ్యలక్ష్మమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కందుకూరి రాజ్యలక్ష్మమ్మ
జననంబాపమ్మ
నవంబరు 5, 1851
కంతేరు, తూర్పు గోదావరి జిల్లా
మరణంఆగష్టు 11, 1910
ప్రసిద్ధిసంఘ సేవకురాలు
భార్య / భర్తకందుకూరి వీరేశలింగం
తండ్రిఅద్దంకి పట్టాభిరామయ్య
తల్లికొండమాంబ

కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (నవంబరు 5, 1851 - ఆగష్టు 11, 1910) ప్రముఖ సంఘ సేవకురాలు. ఈమె సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి భార్యామణి.

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె నవంబరు 5, 1851 తేదీన తూర్పు గోదావరి జిల్లా, కంతేరు గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. ఈమె తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య, కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ వెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగింది. ఈమె 8వ యేట కందుకూరి వీరేశలింగంతో వివాహం జరిగింది. అప్పటికి వీరేశలింగం వయసు 12 సంవత్సరాలు. ఈమె చిన్నతనములో చదివిన చదువుల వల్లను, మేనమామ నేర్పిన సంస్కారం వల్లను తన భర్త సంఘసేవ కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా నిలిచింది.

భర్త స్థాపించిన వితంతు శరణాలయములోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదరించింది. వారికి తగిన వరులు దొరికి వివాహం జరిపినపుడు పెళ్ళి పీటలపై ఈ దంపతులు కూర్చుని కన్యాదానం చేసేవారు. ఈమె తను నివసించే ఆనందాశ్రమారామంలో వితంతువుల కొరకు ఒక ప్రార్థనా సమాజాన్ని స్థాపించి ప్రతి రోజు ఉదయము, సాయంకాలములలో ప్రార్థనలు జరిపేది.[1] ఈమె సంగీతము కొంత అభ్యసించి భగవద్భక్తి పరమైన కీర్తనలు కొన్ని రచించింది.

మరణం[మార్చు]

ఈమె 1910, ఆగష్టు 11వ తేదీన మరణించింది.

మూలాలు[మార్చు]

  1. ప్రజాశక్తి. "రాజేశ్వరమ్మకు నివాళి". Retrieved 4 April 2017.[permanent dead link]

పైవ్యాసంలో రాజ్యలక్ష్మిగారు కందుకూరి రాజ్యలక్ష్మమ్మగారు ఒకరు కాదు. ఈవిషయం చర్చలో పెట్టడానికి ప్రయత్నించేను కానీ నాకు చేతకాలేదు.