Coordinates: 17°52′57″N 78°40′47″E / 17.8824391°N 78.6795836°E / 17.8824391; 78.6795836

గజ్వేల్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గజ్వేల్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
గజ్వేల్ పురపాలకసంఘం is located in తెలంగాణ
గజ్వేల్ పురపాలకసంఘం
గజ్వేల్ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°52′57″N 78°40′47″E / 17.8824391°N 78.6795836°E / 17.8824391; 78.6795836
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్ధిపేట
మండలం గజ్వేల్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ నేతిచిన్న రాజమౌళి
 - వైస్ చైర్‌పర్సన్‌ ఎండీ జకీరుద్దీన్
వైశాల్యము
 - మొత్తం 49 km² (18.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 37,881
 - గృహాల సంఖ్య 9,011
పిన్ కోడ్ - 502278
Area code(s) ఎస్.టి.డి కోడ్ - 08454
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

గజ్వేల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] గజ్వేల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం లోని గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న గజ్వేల్, 2012లో పురపాలక సంఘంగా ఏర్పడింది. ప్రజ్ఞాపూర్, ముత్రాజ్‌పల్లి, క్యాసారం మొదలైన గ్రామపంచాయితీలు; రాజిరెడ్డిపల్లి, సంగుపల్లి, సంగాపూర్, లింగరాజ్ పేట, గుండన్నపల్లి చిన్న గ్రామాలు కలిపి పురపాలకసంఘం ఏర్పాటుచేశారు.

భౌగోళికం[మార్చు]

గజ్వేల్ 49.00 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°51′04″N 78°40′55″E / 17.851°N 78.682°E / 17.851; 78.682 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 60 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం సిద్దిపేట నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న 37,881 జనాభా మొత్తం మంది కాగా, అందులో మంది పురుషులు, మంది మహిళలు ఉన్నారు. 9011 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 18 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం నేతిచిన్న రాజమౌళి చైర్‌పర్సన్‌గా, ఎండీ జకీరుద్దీన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. బొగ్గుల చందు
  2. బొల్లిపల్లి బాలమణి
  3. మార్కంటి వరలక్ష్మి
  4. పంబల అర్చన
  5. చీర్ల శ్యామల
  6. బబ్బూరి రజిత
  7. కురకుల శ్రీనివాస్
  8. ఎండి. జాకియోద్దీన్
  9. మామిడి విద్యారాణి
  10. ఎండి. అబ్దుల్ రహీమ్
  11. గంగిశెట్టి చందన
  12. వంటేరు నారాయణ రెడ్డి
  13. షాహనాజ్
  14. అలవాల బాలేష్
  15. ఉప్పల మెట్టయ్య
  16. తలకోక్కుల భాగ్యలక్ష్మి
  17. దుంబల లక్ష్మి
  18. ఎన్‌సి. రాజమౌలి
  19. గుంటుకు శిరీష
  20. వంటేరు గోపాల్ రెడ్డి

మూలాలు[మార్చు]

  1. "Gajwel Municipality". gajwelmunicipality.telangana.gov.in. Retrieved 16 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 16 April 2021.
  3. "Basic Information of Municipality, Gajwel Municipality". gajwelmunicipality.telangana.gov.in. Retrieved 16 April 2021.
  4. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 16 April 2021.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 16 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]