Coordinates: 18°03′15″N 77°40′35″E / 18.0540714°N 77.6765184°E / 18.0540714; 77.6765184

నారాయణఖేడ్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారాయణఖేడ్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
నారాయణఖేడ్ పురపాలకసంఘం is located in తెలంగాణ
నారాయణఖేడ్ పురపాలకసంఘం
నారాయణఖేడ్ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 18°03′15″N 77°40′35″E / 18.0540714°N 77.6765184°E / 18.0540714; 77.6765184
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండలం నారాయణఖేడ్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ రూబీనా బేగం
 - వైస్ చైర్‌పర్సన్‌ అయ్యర్ పరశురాం
వైశాల్యము
 - మొత్తం 14 km² (5.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 18,243
 - పురుషుల సంఖ్య 9,261
 - స్త్రీల సంఖ్య 8,982
 - గృహాల సంఖ్య 3,600
పిన్ కోడ్ - 502286
Area code(s) టెలిఫోన్ కోడ్ - 08456
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

నారాయణఖేడ్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] నారాయణ్‌ఖేడ్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోని నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

1957 నుండి 1967 వరకు పురపాలక సంఘంగా కొనసాగిన నారాయణ్‌ఖేడ్, ఆ తరువాత మేజర్ గ్రామ పంచాయితీగా ఏర్పాటయింది. 2018లో తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం[మార్చు]

నారాయణఖేడ్ 14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°01′55″N 77°46′23″E / 18.032°N 77.773°E / 18.032; 77.773 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 136 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం సంగారెడ్డి నుండి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 18243 మంది కాగా, అందులో 9261 మంది పురుషులు, 8982 మంది మహిళలు ఉన్నారు. 3600 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 4 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 15 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం రూబీనా బేగం చైర్‌పర్సన్‌గా, అయ్యర్ పరశురాం వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. పి. కవిత
  2. స్వప్న శెట్కర్
  3. దారం శంకర్
  4. రాజేష్ చౌహాన్
  5. పరశురాం
  6. ఆనంద్ శెట్కర్
  7. సంధ్యారాణి
  8. నర్సింహులు
  9. ఉబ్ది సవిత
  10. ఫర్హానా బేగం
  11. లక్ష్మీదేవి శెట్కర్
  12. అబ్దుల్ మజీద్
  13. వివేకానంద
  14. అబేదా బేగం
  15. రుబినా బేగం

మూలాలు[మార్చు]

  1. "Narayankhed Municipality". narayankhedmunicipality.telangana.gov.in. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 19 April 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 19 April 2021.
  4. "Basic Information of Municipality, Narayankhed Municipality". narayankhedmunicipality.telangana.gov.in. Archived from the original on 13 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  5. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 19 April 2021.
  6. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 19 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]