దంతిదుర్గుడు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
దంతివర్మ లేదా రెండో దంతిదుర్గుడిగా పిలువబడే దంతిదుర్గుడు మాన్యఖేతాన్ని పరిపాలించిన రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు. ఇతడు కర్ణాటకలోని గుల్బర్గాను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇతని తరువాత మొదటి కృష్ణుడు అధికారానికి వచ్చి మొత్తం కర్ణాటక ప్రాంతాన్ని రాష్ట్రకూట పాలన కిందికి తెచ్చాడు.
దంతిదుర్గుని ఎల్లోరా శాసనాల ప్రకారము క్రీ.శ.753లో ఇతడు చాళుక్యులను ఓడించి రాజాధిరాజ మరియు పరమేశ్వర బిరుదాలను పొందినాడు. శాసనాల ప్రకారము అతడు రెండో ఇంద్రుని కుమారుడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఉన్న సమన్గఢ్ శాసనం ప్రకారము అతని తల్లి చాళుక్య యువరాణి అయిన భావనగ. క్రీ.శ.756లో దంతిదుర్గుడు మరణించాడు.