నోరి నరసింహశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోరి నరసింహశాస్త్రి
జననంనోరి నరసింహశాస్త్రి
1900
గుంటూరు
మరణం1978
వృత్తికవి, నాటక, నవలా రచయిత
తండ్రిహనుమచ్ఛాస్త్రి
తల్లిమహాలక్ష్మి

నోరి నరసింహశాస్త్రి (1900 - 1978) ప్రముఖ తెలుగు కవి. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషలలో అతివేలమయిన అభినివేశాన్ని సంపాదించుకున్న మనీషులు. సాహిత్య శాస్త్రవలోకనంలో, ప్రాచీనాంధ్ర కవితా పరిశీలనంలో, అధునాతన సాహిత్య నిర్మాణంలో, సాంస్కృతిక అధ్యయనంలో, నవ్య సాహిత్య సమీక్షలో శ్రీ శాస్త్రిగారు గంభీరమయిన పరిశ్రమ చేసినవారు. సాహిత్యోద్యమంలో అగ్రేసరులు.

జీవిత విశేషాలు[మార్చు]

నరసింహశాస్త్రిగారు 1900 సంవత్సరంలో జూన్ 2వ తేదీన హనుమచ్చ శాస్త్రి, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. వీరి పూర్తి పేరు వెంకట లక్ష్మీనరసింహ శాస్త్రి. బి.ఎ. (1919) బి. యల్. (1925) పట్టభద్రులు. వృత్తి రీత్యా న్యాయవాదులైనా ప్రవృత్తి రీత్యా సనాతన ధర్మవాది. శ్రీకల్యాణానంద భారతీస్వామివారివద్ద దీక్ష స్వీకరించి "విజ్ఞానంద" అనే నామాన్ని స్వీకరించారు.

వీరు సాహితీ సమితి కార్యదర్శిగాను, రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగాను పనిచేశారు. వీరు నవ్యసాహిత్యపరిషత్తును స్థాపించినారు.

రచనలు[మార్చు]

  • 1. గీతమాలిక
  • 2. భాగవతావరణము (పద్యనాటిక)
  • 3. సోమనాథ విజయము (నాటకము)
  • 4. ఖేమాభిక్కుని
  • 5. వరాగమనము
  • 6. ఆత్మమృతి
  • 7. తేనెతెట్టె
  • 8. పతంగయాత్ర
  • 9. స్వయంవరము.
  • 10. షణ్ణవతి (ఇత్యాది నాటికలు, కావ్యములు)
  • 11. నారాయణభట్టు (నవల)
  • 12. రుద్రమదేవి (నవల)
  • ఇంకను, అనేక కథలు, వ్యాసములు.

బిరుదములు[మార్చు]

  • కవి సమ్రాట్

మరణము[మార్చు]

వీరు 1978, జనవరి 4న హైదరాబాదులో తమ 77వ యేట మరణించారు[1].

మూలాలు[మార్చు]

  1. సంపాదకులు (5 January 1978). "నోరి నరసింహశాస్త్రి కాలధర్మం". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 64, సంచిక 272. Retrieved 13 December 2017.[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]