పెన్నా శివరామకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెన్నా శివరామకృష్ణ
పెన్నా శివరామకృష్ణ (2021)
జననంపెన్నా వేంకట శివరామకృష్ణ శర్మ
ఫిబ్రవరి 2, 1960
దుగునవల్లి గ్రామం, నల్గొండ జిల్లా
ప్రసిద్ధితెలుగు కథా రచయిత
మతంహిందువు
తండ్రిశేషావతారం
తల్లిఅనంతలక్ష్మి

పెన్నా శివరామకృష్ణ తెలుగు కవీ, విమర్శకుడు, రిటైర్డ్‌ లెక్చరర్‌.[1] 2021లో తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ పురస్కారాన్ని అందుకున్నాడు.

2021 కాళోజీ స్మారక పురస్కారాన్ని అందుకుంటున్న పెన్నా శివరామకృష్ణ
కాళోజీ స్మారక పురస్కారం సందర్భంగా మాట్లాడుతున్న పెన్నా శివరామకృష్ణ

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన పూర్తి పేరు పెన్నా వేంకట శివరామకృష్ణ శర్మ (పి.వి. యస్. ఆర్. కె. శర్మ). ఆయన నల్గొండ జిల్లా దుగునవల్లి గ్రామంలో 1960 ఫిబ్రవరి 2 న అనంతలక్ష్మి,శేషావతారం దంపతులకు జన్మించారు. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కట్టంగూరులో చదువుకున్నాడు. నల్లగొండలోని గీతావిజ్ఞాంధ్ర కళాశాల నుంచి, డి. ఓ. యల్. బి. ఓ. యల్. డిగ్రీలను పొందినాడు. హైదరాబాదు విశ్వవిద్యాలయము నుండి యం. ఏ. (1980 - 82), యం. ఫిల్. (1983) డిగ్రీలను పొందినాడు. "శేషేంద్ర కవిత్వానుశీలనం" అనే అంశం మీద పరిశోధన చేసి, అదే హైదరాబాదు విశ్వవిద్యాలయము నుంచి పిహెచ్. డి. పట్టం పొందినాడు.

తెలుగు హైకూలు[మార్చు]

తెలుగులో హైకూలను పరిచయం చేసింది ఇస్మాయిల్ (కవి) గారు[2]. 1991లో పెన్నా శివరామకృష్ణ ' రహస్యద్వారం ' పేరుతో తొలి తెలుగు హైకూ కవిత్వ సంపుటిని తీసుకవచ్చాడు. "చినుకుల చిత్రాలు" (2000), "సులోచనాలు" (2006) పేర్లతో మరో రెండు హైకూ సంకలనాలను కూడా పెన్నా శివరామకృష్ణ ప్రచురించాడు. ప్రపంచంలోని, భారతదేశంలోని వివిధ భాషలలో వచ్చిన కొన్ని హైకూలను తెలుగులోనికి అనువదించి "దేశదేశాల హైకూ" (పాలపిట్ట బుక్స్ ప్రచురణ, 2009) అనే మరో అనువాద రచనను కూడా పెన్నా శివరామకృష్ణ వెలువరించాడు. "ప్రపంచ వ్యాప్త కవితా ప్రక్రియ హైకూ", "హైకూ - స్వరూప స్వభావాలు" అనే శీర్షికలతో పెన్నా శివరామకృష్ణ రాసిన రెండు వ్యాసాలు కూడా "దేశదేశాల హైకూ" పుస్తకంలో ప్రచురింపబడినాయి. 1994లో గాలి నాసరరెడ్డి జపాన్ హైకూలను తెలుగులోకి అనువదించారు.

రచనలు[మార్చు]

  • నిశ్శబ్దం నా మాతృక (కవితాసంపుటి 1987), "అలల పడవలమీద' (కవితాసంపుటి 1990), "రహస్యద్వారం" (హైకూ సంపుటి 1991), "జీవనది" (కావ్యం, 1995), "సల్లాపం" (గజళ్ళ సంపుటి, 2003) శిశిరవల్లకి - పెన్నా శివరామకృష్ణ తెలుగు గజళ్ళు (రచయిత 2011 డిసెంబరు నుంచి 2012 ఆగస్టు వరకు రాసిన సుమారు 90 గజళ్ళ నుంచి ఎన్నిక చేసిన గజళ్ళతో రూపొందించినది ఈ పుస్తకం.)[3] "దీపఖడ్గం" కవితాసంపుటి ప్రచురించారు.
  • తెలంగాణ రుబాయీలు.
  • దేశదేశాల హైకు[4]
  • కవితా దశాబ్ది (1991-2000) (సంపాదకత్వం -ఎస్వీ సత్యనారాయణతో కలిసి),
  • దశాబ్దికవిత (2001-2010) (సంపాదకత్వం -ఎస్వీ సత్యనారాయణతో కలిసి)

అవార్డులు[మార్చు]

  • కవితా సంకలనం "దీపఖండం"కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది.[5]
  • పెన్నా శివరామకృష్ణ సెప్టెంబర్ 7, 2021న తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పురస్కారానికి ఎంపికయ్యాడు.[6] ఆయన 9 సెప్టెంబర్ 7, 2021న రవీంద్ర భారతిలో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాలలో అవార్డు కింద రూ.1,01,116/- నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను రాష్ట్ర మంత్రులు వి. శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న చేతుమీదుగా అందుకున్నాడు.[7]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (7 September 2021). "నిబద్ధ కవి పెన్నా". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
  2. తెలుగు సాహిత్య చరిత్ర, రచన:డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, విశాలంధ్ర ప్రచురణలు, 2001, పుట-315
  3. "శిర వల్లకి - పెన్నా శివరామకృష్ణ తెలుగు గజళ్ళు". Archived from the original on 2015-05-02. Retrieved 2015-07-20.
  4. New Arrivals
  5. "పెన్నా 'దీపఖడ్గం'కు అవార్డు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-07-20.
  6. Andrajyothy (7 September 2021). "కాళోజీ పురస్కారానికి ఎంపికైన పెన్నా శివరామ కృష్ణ". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
  7. Sakshi (10 September 2021). "ఉద్యమకారులకు స్ఫూర్తి.. కాళోజీ". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.