హైదరాబాదు విశ్వవిద్యాలయము
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
హైదరాబాదు విశ్వవిద్యాలయము (University of Hyderabad) 1974లో భారతదేశ పార్లమెంటు యొక్క చట్టముచే కేంద్ర విశ్వవిద్యాలయముగా యేర్పరచబడినది. హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయముగా పేరుపొందిన ఈ విశ్వవిద్యాలయమును ఇటీవల హైదరాబాదు విశ్వవిద్యాలయముగా నామకరణము చేశారు. ఈ విశ్వవిద్యాలయము ఉన్నత విద్యకు మరియు పరిశోధనకు భారతదేశములో అత్యున్నత విద్యాసంస్థగా ఎదిగినది.
విశ్వవిద్యాలయము యొక్క ప్రధాన క్యాంపస్ హైదరాబాదు నుండి 20 కిలోమీటర్ల దూరంలో శివార్లలో పాత హైదరాబాదు - బాంబే రహదారిపై ఉన్నది. ౨౦౦౦ ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ విశ్వవిద్యాలయము హైదరాబాదు నగరములోని అతి సుందరమైన క్యాంపస్ లలో ఒకటి. నగరములోని అనుబంధ క్యాంపస్ సరోజినీ నాయుడు యొక్క గృహమైన బంగారు గడప (గోల్డెన్ త్రెష్హోల్డ్) లో ఉన్నది.
[మార్చు] ఉపకులపతులు
- ప్రొఫెసర్ గురు భక్ష్ సింగ్
- ప్రొఫెసర్ బి.ఎస్.రామకృష్ణ
- ప్రొఫెసర్ బి.కృష్ణమూర్తి
- ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా
- ప్రొఫెసర్ ఎ.కె.భట్నగర్
- ప్రొఫెసర్ పి.రామారావు
- ప్రొఫెసర్ కోటా హరినారాయణ