మూస:ఈ వారపు వ్యాసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాళుక్యులు

చాళుక్యులు సా.శ. 6 - 12 శతాబ్దాల మధ్య దక్షిణ భారతదేశంలో చాలా భాగం, మధ్య భారతదేశంలో కొంతవరకు పరిపాలించిన రాజవంశం. ఈ కాలంలో వీరు ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన మూడు ప్రత్యేక వంశాలుగా పరిపాలన చేశారు. చాళుక్యులలో అన్నింటికన్నా ప్రాచీనమైన వారు సా.శ 6వ శతాబ్దం మధ్య, వాతాపి (ప్రస్తుతం బాదామి) కేంద్రంగా పరిపాలించిన బాదామి చాళుక్యులు. వీరు ప్రస్తుతం కర్ణాటకలోని సిర్సి సమీపంలో ఉన్న బనవాసి కేంద్రంగా పరిపాలించిన కదంబ రాజ్యం క్షీణించినప్పుడు తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. రెండవ పులకేశి పాలనలో వేగంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. రెండవ పులకేశి మరణించిన తర్వాత తూర్పు దక్కను ప్రాంతాన్ని పరిపాలించే తూర్పు చాళుక్యులు స్వతంత్య్ర రాజ్యంగా ఏర్పడ్డారు. వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేంగి ప్రాంతం కేంద్రంగా 11వ శతాబ్దం దాకా పరిపాలించారు. పశ్చిమ దక్కను ప్రాంతంలో 8వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటుల ప్రాబల్యంతో బాదామి చాళుక్యుల ప్రాభవం మసక బారింది. అయితే వారి వారసులైన పశ్చిమ చాళుక్యులు 10వ శతాబ్దం చివరి నాటికి మళ్ళీ బలం పుంజుకున్నారు. వీరు కళ్యాణి (ప్రస్తుతం కర్ణాటకలోని బసవకల్యాణ్) ప్రాంతం నుంచి సుమారు 12వ శతాబ్దం దాకా పరిపాలించారు.
(ఇంకా…)