రామన్ మెగసెసే పురస్కారం
వికీపీడియా నుండి
రామన్ మెగసెసే పురస్కారం న్యూయార్క్ కి చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ఇది తరచూ "ఆసియా ఖండపు నోబెల్ బహుమతి"గా అభివర్ణించబడుతుంది.[1][2][3] ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే ఫౌండేషన్ తమతమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆసియా దేశపు వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంటుంది.
ఈ బహుమతిని ప్రధానంగా క్రింది ఆరు విభాగాల్లో ప్రకటిస్తారు.
- ప్రభుత్వ సేవ
- ప్రజా సేవ
- సామాజిక నాయకత్వం
- జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత
- ప్రపంచ శాంతి
- అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ Clare Arthurs. "Activists share 'Asian Nobel Prize'", బీబీసీ న్యూస్, 2000-07-25. Retrieved on 2008-02-20.
- ↑ "అరవింద్ కెజ్రివాల్ కు మెగసెసే బహుమతి", ద టైమ్స్ ఆఫ్ ఇండియా, 2006-07-31. Retrieved on 2008-02-21.
- ↑ Ann Bernadette Corvera. "'03 RAMON MAGSAYSAY AWARDEES: A LEAGUE OF EXTRAORDINARY MEN & WOMEN", Philippine Star, 2003-10-08. Retrieved on 2008-02-21.