వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 11వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫతేపూర్ సిక్రీ

ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రా జిల్లా లోని ఒక నగరం. ఈ నగరాన్ని మొగల్ చక్రవర్తి అక్బర్ 1569లో స్థాపించాడు. ఇది అక్బర్ కాలంలో 1571 నుండి 1585 వరకు మొఘలుల రాజధానిగా ఉండేది. చిత్తోర్ రాన్తంభోర్ మీద విజయం సాధించిన తరువాత అక్బర్ తన రాజధానిని ఆగ్రా నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిక్రీ రిట్జ్ ప్రదేశానికి తరలించాలని అనుకున్నాడు. సూఫీ సన్యాసి సలీం చిష్టి గౌరవార్ధం సిక్రీ రిట్జ్ వద్ద నగరాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అక్బర్ చక్రవర్తి ఈ ప్రదేశంలో కోటగోడలు కలిగిన నగర నిర్మాణం చేయాలని సంకల్పించాడు. రాజభవనాలు, అంతఃపురాలు, సభాప్రాంగణాలు, మసీదు, ప్రైవేట్ క్వార్టర్లు మరియు ఇతర ఉపయోగాలకు అవసరమైన భవనాలతో కూడిన కోట నిర్మాణ కార్యక్రమాలు 15 సంవత్సరాల కాలం కొనసాగింది. అక్బరు చక్రవర్తి ఆ నగరానికి ఫతేహబాదు అని నామకరణం చేసాడు. అరాబిక్ పూర్వీకమైన పర్షియన్ భాషలో ఫతేహ్ అంటే విజయం అని అర్ధం. తరువాత అది ఫతేపూర్ సిక్రీగా పిలువబడింది. మొగలుల సంరక్షించబడుతున్న ప్రముఖ నిర్మాణాలలో ఫతేపూర్ సిక్రీ ఒకటి. సమకాలీన చరిత్రకారులు ఫతేపూర్ సిక్రీ నిర్మించడానికి అక్బర్ చాలా ఆసక్తి చూపాడని నిర్మాణం రూపకల్పన మరియు నిర్మాణశైలికి కూడా అక్బరు సూచనలు ఇచ్చాడని భావించారు. వారి పూర్వీకుడైన తైమూరును కీర్తిని స్పురింపజేసేలా పర్షియన్ శైలిలో అద్భుతమైన సభామంటపాల నిర్మాణానికి రూపకల్పన చేయబడింది.


(ఇంకా…)