1994 నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 1994 డిసెంబరులో 294 నియోజకవర్గాలలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లపాటు పాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ 226 స్థానాల్లో గెలిచి భారీ మెజారిటీ సాధించింది. భారత జాతీయ కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే గెలుచుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ 3వసారి ప్రమాణ స్వీకారం చేశాడు.[1][2][3][4]
సంయుక్త ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 294 నియోజకవర్గాలుండేవి. 1994 ఎన్నికల నాటికిషెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 39 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 15 నియోజకవర్గాలు రిజర్వ్ చేసి ఉన్నాయి.