అబ్దుల్ అజీజ్ ముహమ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌ రచనా వ్యాసంగముతో బాటు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం, శ్రీమద్రామాయణం, శ్రీమద్భాగవతం, హరికథలు చెప్పడంలో దిట్ట.

బాల్యము[మార్చు]

అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌ విశాఖపట్నం జిల్లా ఎస్‌.రాయవరంలో 1970 మార్చి 21 న జన్మించారు. తల్లితండ్రులు: మదీనా, కాశింబీబి.

ఉద్యోగం[మార్చు]

అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌ విశాఖపట్నం నావెల్‌డాక్‌ యార్డ్‌లో టెక్నీషియన్‌ పనిచేస్తున్నారు.

రచనా వ్యాసంగము[మార్చు]

అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌ ముస్లిం గురువు షేక్‌ సత్తార్‌ ప్రోత్సాహంతో 1979లో 'శంకుస్థాపన' కవిత రాయడంతో సాహిత్యరంగ ప్రవేశం చేశారు. ఇతని కలంపేర్లు: మహోదాయ, హరిఃఓమ్‌. ఈ పేరుతో అనేక కవితలు, కథానికలు, వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. పలు కవితలు ఆంగ్లం లోకి కూడా అనువాదం అయ్యాయి. 'శంకుస్థాపన' కవిత 2000లో ఆంగ్లంలోకి, 'గుజరాత్‌గాయం' కవితా సంపుిటిలోని 'ఖబర్దార్‌' కవిత పలు జాతీయ భాషల్లో తర్జుమా అయ్యింది. హరి:ఓమ్‌ (1997) తదితర కవితా సంపుటాలు ప్రచురితమయ్యాయి.

అవార్డులు-పురస్కారాలు[మార్చు]

విశాఖపట్నంలో సాహితీ సరస్వతి పురస్కారాన్ని, వచన కవితా సురభి పురస్కారాన్ని మచిలీపట్నంలో అందుకున్నారు.

ప్రత్యేకతలు[మార్చు]

అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌ ముస్లిం అయి వుండీ రచనా వ్యాసంగముతో బాటు ఇతనికి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం, శ్రీమద్రామాయణం, శ్రీమద్భాగవతం, హరికథలు చెప్పడంలో దిట్ట.

లక్ష్యం[మార్చు]

ఇతనికి త్యాగరాజు, అన్నమాచార్యులు, రామదాసు కీర్తనల ఆలాపన, వీటిపై పరిశోధన చేయడము, ప్రసంగాలు నిర్వహించడము. రచనల ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం సాగించాలని ఇతనికి ఆకాంక్ష ఎక్కువ. దానితో బాటు పరమత సహనం, మతసామరస్యం, ప్రగతిశీలత సాధించాలన్నది ఇతని ప్రధాన లక్ష్యం.

మూలాలు[మార్చు]

  • అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010

ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌

చిరునామా వినుకొండ - 522647. పుట 30