అర్మేనియన్ స్మశానవాటిక (హైదరాబాదు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అర్మేనియన్ స్మశానవాటిక (ఉప్పుగూడ అర్మేనియన్ స్మశానవాటిక), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉప్పుగూడలో ఉన్న స్మశానవాటిక. కుతుబ్ షాహీ కాలానికి చెందిన ఈ స్మశానవాటిక, మూడు వందల సంవత్సరాల పూర్వం ఏర్పాటుచేయబడింది.[1]

స్మశానవాటిక[మార్చు]

ఇక్కడ అర్మేనియన్ స్మశానాలు, చర్చియార్డ్ ఉన్నాయి. ఈ స్మశానవాటికలో మొత్తం 19మంది అర్మేనియన్లను ఖననం చేశారు. వారిలో రెవ్ జోహన్నెస్ (1680), రెవ్ సైమన్ (1724) అనే ఇద్దరు పూజారులు కూడా ఉన్నారు. హైదరాబాదు నగరంతో అర్మేనియన్లకు ఉన్న సంబంధానికి ఇదే చివరి గుర్తు.[2]

హైదరాబాదులో అర్మేనియన్ స్థావరం కూడా ఉంది. హైదరాబాద్‌లోని అర్మేనియన్ సమాజం హోలీ ఎట్చ్మియాడ్జిన్ నుండి పోంటిఫికల్ బుల్‌ను అందుకుంది. హైదరాబాదులో నివసిస్తున్న డచ్, ఆంగ్లేయులకు ప్రత్యేకమైన స్మశానవాటిక లేకపోవడంతో ఈ స్మశానవాటికను పంచుకున్నారు.[3]

పరిరక్షణ[మార్చు]

భారత పురావస్తు ప్రదేశాల స్మారక చిహ్నం, చట్టం (1960) ప్రకారం ఈ శ్మశానవాటికను పురావస్తు శాఖ పరిరక్షిస్తోంది. నివాసితుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా ఇది దాదాపుగా క్షీణదశలో ఉంది.[4]

మూలాలు[మార్చు]

  1. "Archived copy". Archived from the original on 28 May 2018. Retrieved 22 February 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Armenian cemetery in dire straits". The Hindu. 28 March 2012. Retrieved 22 February 2021.
  3. "High on hobbies: A society chronicles history in its own way". The Times of India. 1 May 2012. Archived from the original on 26 జనవరి 2013. Retrieved 22 February 2021.
  4. "In India, Historic Armenian Cemetery Buried Under Waste". Asbarez. 17 April 2009. Retrieved 22 February 2021.

బయటి లింకులు[మార్చు]