భారత పురాతత్వ సర్వే సంస్థ
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
![]() | |
సంకేతాక్షరం | ASI |
---|---|
స్థాపన | 1861 |
రకం | GO |
ప్రధాన కార్యాలయాలు | జన్పథ్, కొత్త ఢిల్లీ - 110011 |
సేవా ప్రాంతాలు | భారత దేశం |
Parent organization | సాంస్కృతిక శాఖామాత్యులు, భారత ప్రభుత్వం |
జాలగూడు | అధికారిక వెబ్సైట్ |
భారత పురాతత్వ శాఖ (ఏఎస్ఐ) భారత ప్రభుత్వపు సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో భాగంగా ఉండే సంస్థ.[1] భారతదేశ పార్లమెంటు చట్టాల ప్రకారం దేశంలోనిపురావస్తు అధ్యయనాలు, పురావస్తు వారసత్వ కట్టడాలు, ప్రాంతాల పరిరక్షణకు ఏఎస్ఐ బాధ్యత వహిస్తుంది.[2] సంస్థ వెబ్సైట్ ప్రకారం దాని విధులు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న కట్టడాల తవ్వకం, అన్వేషణ, పరిరక్షణ, భద్రత, రక్షణ. పురాతన వస్తువులు, కళాఖండాల స్మగ్లింగ్, తప్పుడు వర్తకాల నిరోధానికి వాటి ఎగుమతి వర్తకాన్ని నియంత్రించడాన్ని ఏఎస్ఐ విధిగా పెట్టుకుంది. దాంతోపాటు వాటిని, వాటికి సంబంధించిన ఇతర వస్తువులను బలవంతంగానైనా సేకరించి, ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచడం సంస్థ విధుల్లో ముఖ్యమైనది.[3] వీటితో పాటు సంస్థ పలు ఇతర కార్యకలాపాలు కూడా నిర్వర్తిస్తుంది. యువ ఔత్సాహికులకు పురావస్తు శాస్త్రంలో శిక్షణ ఇవ్వడం వాటిలో ఒకటి.[4] ఇందుకోసం ఢిల్లీలో ఏఎస్ఐ ఒక ప్రఖ్యాత సంస్థను నడుపుతోంది.[5]
విషయ సూచిక
నేపథ్యం[మార్చు]
బ్రిటిష్ ఇండియా హయాం నుంచీ సాగుతూ వచ్చిన ప్రయత్నాలకు అంతిమ ఫల స్వరూపంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఏర్పాటైంది. దాంట్లో భాగంగా సర్ విలియం జోన్స్ 1784 జనవరి 15న ఏషియాటిక్ సొసైటీని ఏర్పాటు చేశారు.[6]
స్థాపన[మార్చు]
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను బ్రిటిష్ వలసవాద సామ్రాజ్య హయాంలో 1861లో సర్ అలెగ్జాండర్ కనింగ్హం అప్పటి వైస్రాయ్ చార్లెస్ జాన్ కనింగ్ సహాయంతో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో దాని పరిధి అఫ్గానిస్తాన్, బర్మాలతో కలిసిన మొత్తం భారత ఉపఖండం మీద ఉండేది.[7] తొలినాళ్లలో చాలావరకు అన్వేషణ కార్యక్రమాల్లో సంస్థ నిమగ్నమై ఉండేది. దాని ఫలితంగా సంకిసా, శ్రావస్థి, బార్హాట్, కోశాంబీ వంటి చారిత్రక స్థలాలు వెలుగు చూశాయి.[8] ఈ కార్యకలాపాలలో కనింగ్హం చాలా ప్రముఖ పాత్ర పోషించారు. దాంతోపాటు భారతదేశ చారిత్రక పురాతత్వ పరిశోధనలకు ఆయన దారులు పరిచారు.[9] కానింగ్హం హయాంలో (1867-68) ఏఎస్ఐకి చెందిన ఏసీఎల్ కార్లైల్ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలోని సుహాగిఘాట్ రాతి గుహల్లో ముఖ్యమైన రాతి చిత్రలేఖనాలను కనిపెట్టారు.[10] ఇందులోని కొన్ని చిత్రాలు పూర్వ చారిత్రక యుగానికి చెందినవని, ఐరోపాలో వాటికి సంబంధించిన ఆధారాలేవీ కూడా లేవని గుర్తించారు. మార్టిమర్ వీలర్ అనే నావికుడు 1944లో డైరెక్టర్ జనరల్ అయ్యాక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సిమ్లాలోని రైల్వే బోర్డు భవనంలో ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం[మార్చు]
ఏఎస్ఐ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మిగిలున్న దాదాపు 3,650 జాతీయ ప్రాధాన్యతున్న కట్టడాల బాధ్యతలను పురాతత్వ కట్టడాలు, [11] పురాతత్వ ప్రదేశాలు, శిథిలాల చట్టం 1958 (1958 నం 24), రూల్ 1959 ప్రకారం నిర్వహిస్తున్నది. ఇటీవలి కాలంలో అన్వేషించిన ముఖ్యమైన ప్రాంతాల్లో హర్యానాలోని థానేసర్లో హర్ష కా తిలా ముఖ్యమైనది. మధ్యయుగంలోని కుషానుల కాలానికి చెందిన పలు సాంస్కృతిక కొనసాగింపులకు ఇది ఋజువుగా ఉంది.
డైరెక్టర్ జనరళ్లు[మార్చు]
డైరెక్టర్ జనరల్ | పదవీ కాలం |
---|---|
సర్ అలెగ్జాండర్ కానింగ్ హం | 1871–1885 |
జేమ్స్ బుర్గెస్ | 1886–1889 |
సర్ జాన్ మార్షల్ | 1902–1928 |
హెరాల్డ్ హార్గ్రీవ్స్ | 1928–1931 |
రాయ్ బహదూర్ దయారాం సాహ్నీ | 1931–1935 |
జేఎఫ్ బ్లాకిష్టన్ | 1935–1937 |
రావ్ బహదూర్ కేఎన్ దీక్షిత్ | 1937–1944 |
మార్టిమమ్ వీలర్ | 1944–1948 |
ఎన్పీ చక్రవర్తి | 1948–1950 |
మాధవ్ స్వరూప్ వత్స్ | 1950–1953 |
ఎ.ఘోష్ | 1953–1968 |
బి.బి.లాల్ | 1968–1972 |
ఎం.ఎన్.దేశ్పాండే | 1972 - ? |
బి.కె.థాపర్ | ? - ? |
ఆర్.ఎస్.బిస్త్ | ? - 2004 |
ఎన్.కె.శ్రీవాత్సవ | 2004–? |
డాక్టర్ గౌతం సేన్ గుప్తా |
ప్రచురణలు[మార్చు]
1862 - 63 నుంచి ఇప్పటిదాకా తమ పర్యటన ఫలితాలన్నింటినీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించడం మొదలు పెట్టింది. న్యూ ఇంపీరియల్ సిరీస్ అనే కొత్త సిరీస్ను 1874లో మొదలు పెట్టి, 1933 దాకా కొనసాగించారు. పురావస్తు శిథిలాలపై వీటిలో విస్తారమైన పరిశోధన నిక్షిప్తమై ఉంది. 1902 నుంచి వార్షిక నివేదికల ప్రచురణ కూడా మొదలైంది. మెమోయిర్స్ ఆఫ్ ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారిగా 1919లో వచ్చింది. దాని తాజా (98వ) సంచిక 2003లో వెలువడింది. ఏన్షియంట్ ఇండియా పేరుతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1946లో ఒక బులెటిన్ మొదలు పెట్టింది. ఆర్కిటెక్చరల్ సర్వే ఆఫ్ టెంపుల్స్ పేరుతో భారతీయ ఆలయ నిర్మాణ రీతులపై మోనోగ్రాఫ్ను కూడా ప్రచురించింది. దీంతోపాటు ఇన్వెంటరీ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ను సిద్ధపరిచి ప్రచురించేందుకు 1997లో ప్రయత్నాలు మొదలు పెట్టింది. భారత ప్రభుత్వం పరిరక్షించిన కట్టడాల తాలూకు వివరాలన్నీ ఇందులో ఉంటాయి.
ఇక ఏఎస్ఐ తాలూకు అతి ముఖ్యమైన ప్రచురణగా ఎపిగ్రాఫియా ఇండికాను చెప్పవచ్చు. దీన్ని తొలుత 1892లో ప్రచురించారు. నాటి నుంచీ 42 సంపుటాలను ఇప్పటిదాకా వెలువరించారు. యాన్యువల్ రిపోర్ట్ ఆన్ ఇండియన్ ఎపిగ్రఫీని 1887 నుంచి 1995-96 దాకా ప్రచురించారు. వీటిలో ఏటా కొత్తగా తయారు చేసిన శిలాశాసన వివరాలను పొందుపరిచారు. పలు రాజ వంశాల వారీగా వచ్చిన శాసనాలను ఇందులో కార్పస్ ఇన్స్క్రిప్టినమ్ ఇండికారం పేరుతో సిరీస్గా ప్రచురించారు. సౌతిండియన్ ఇన్స్క్రిప్షన్స్, యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ సౌతిండియన్ ఎపిగ్రఫీల్లో దక్షిణ భారతదేశానికి చెందిన శాసనాల వివరాలుంటాయి.
వీటిని కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ భారతీయ పురాతత్వ సర్వేక్షణ (హైదరాబాదు వలయం) జాలస్థలి
- ↑ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, చట్టాలు
- ↑ [1]
- ↑ [2]
- ↑ [3]
- ↑ సురీందర్నాథ్ రాయ్, భారతీయ పురావస్తు అవలోకన 1961. ద స్టోరీ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. 1784 - 1947. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ
- ↑ సురీందర్నాథ్ రాయ్, భారతీయ పురావస్తు అవలోకన 1961. ద స్టోరీ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. 1784 - 1947. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ
- ↑ http://asi.nic.in/asi_aboutus_history.asp
- ↑ ఉపీందర్ సింగ్, 2004. డిస్కవరీ ఆఫ్ ఏన్షెంట్ ఇండియా: అర్లీ ఆర్కియాలజిస్ట్స్ అండ్ ద బిగినింగ్స్ ఆఫ్ ఆర్కియాలజీ. పర్మనెంట్ బ్లాక్, ఢిల్లీ
- ↑ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఫర్ ఫిబ్రవరి, 1883, పేజీ 49.
- ↑ http://asi.nic.in/asi_monuments.asp
బయటి లంకెలు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to భారత పురాతత్వ సర్వే సంస్థ. |
- Official website
- ప్రపంచ వారసత్వ కట్టడం, ఆల్ టెంటేటివ్ సైట్స్, అన్ని టెంటేటివ్ సైట్ల సమీక్ష ఇక్కడుంది. చివరగా 2007 జనవరిలో అప్డేట్ చేశారు.
- ప్రపంచ వారసత్వం, టెంటేటివ్ సైట్లు, రాష్ట్రం: భారతదేశం
- ధోలవీర: హరప్పా నగరం, కచ్ జిల్లా, గుజరాత్, భారతదేశం, భారతదేశం (ఆసియా అండ్ ద పసిఫిక్), సమర్పించిన తేదీ: 07/03/1998, దీన్ని సిద్ధపరిచింది: ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కో ఆర్డినేట్స్: 23°53'10" N, 70°11'03" E, Ref.: 1090