ఆకురాతి గోపాలకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కవిశ్రీ ఆకురాతి గోపాలకృష్ణ ప్రఖ్యాత రచయిత, హేతువాది.[1]1931 లో అమ్మనబ్రోలులో ఆకురాతి వెంకటకృష్ణయ్య, రత్నమ్మలకు జన్మించారు.పొదలకూరు, రేవూరు, కోవూరు, ఏ.యస్.పేట, కలిగిరి లలో ఉద్యోగబాధ్యతలు నిర్వహించారు.1.12.2018న మరణించారు.

రచనలు[మార్చు]

  • నడమంత్రపు ఊహల్లో నరులు
  • దేవుడెక్కడ?
  • ఆకురాతి శతకం
  • మన పెంపుడు శతృవులు
  • తెలిసినడుచుకొమ్ము తెలుగు బిడ్డ[2] ఇది 105 పద్యాల శతకం.

కొన్ని పద్యాలు[మార్చు]

ఆకురాతి శతకంలో ఒక పద్యం:

రాయి వేల్పుకాదు రక్షించికాపాడ
తాడుపాము కాదు తరిమికరువ
వట్టి భ్రమల నమ్మి నట్టేట మునుగకు
ఆకురాతి మాట అణు బరాట!!

తెలిసినడుచుకొమ్ము తెలుగు బిడ్డ లో ఒక పద్యం:

అమ్మ యనెడి తెలుగు కమ్మని పిలుపును
మమ్మి వచ్చి చేరి మట్టు పెట్టె
మేక వన్నె పులిని సాకిన ఫలమిది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

మూలాలు[మార్చు]

  1. "జల్లెడ - బ్లాగులను జల్లించండి One Stop For Telugu Blogs బ్లాగు అధికారభాషగా తెలుగు నుండి టపాలు". www.jalleda.com. Archived from the original on 2018-03-31. Retrieved 2018-01-20.
  2. "Google Groups". groups.google.com. Retrieved 2018-01-20.

బాహ్య లంకెలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


ఇవీ చూడండి[మార్చు]