ఉపాధ్యాయుల సూర్యనారాయణ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉపాధ్యాయుల సూర్యనారాయణ రావు

ఉపాధ్యాయుల సూర్యనారాయణ రావు (1923–1971) తెలుగు నాటక రచయిత, జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో నివసించి, జర్నలిస్టుగా పనిచేశాడు. అతను హరికథా పితామహ బిరుదాంకితుడైన అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు మనవడు. అతను పాఠశాల విద్యకు మధ్యలో వదిలిపెట్టి సాహిత్యం, చరిత్ర, తత్వశాస్త్రంలో స్వీయ అభ్యసనం చేసాడు. అతను తెలుగు భాషా వేదికతో చురుకుగా పనిచేసాడు. అతను శ్రీ విజయరామ నాటక కళా పరిషత్ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. ఈ సంస్థ క్రమం తప్పకుండా నాటక పోటీలను నిర్వహించింది. నాటక పోటీలకు న్యాయమూర్తిగా అతనిని ఇతర నిర్వాహకులు తరచూ ఆహ్వానించేవారు. అతను ప్రారంభ సంవత్సరాల్లో ప్రజ సోషలిస్ట్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నాడు.

రూపవాణి (మద్రాసు నుండి ప్రచురించబడిన తెలుగు చలనచిత్రం, రాజకీయ మాస పత్రిక), స్వతంత్ర (మద్రాస్ నుండి తెలుగు, ఆంగ్లంలో ప్రచురించబడిన రాజకీయ పత్రిక) కోసం ఫ్రీలాన్సర్ గా తన జర్నలిస్ట్ వృత్తిని ప్రారంభించాడు. తరువాతి సంవత్సరాల్లో అతను జ్యోతికి (విజయవాడ నుండి ప్రచురించబడిన తెలుగు వారపత్రిక, రాజకీయ టాబ్లాయిడ్) కథనాలను కూడా అందించాడు. అతను ఆంధ్ర ప్రభ , ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కోసం 1962 నుండి 1971 వరకు కరస్పాండెంట్‌గా పనిచేశాడు. 1960 లలో అతను స్థానిక వారపత్రిక ది అడ్వర్టైజర్ యొక్క అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేశాడు. అతను తెలుగులో నవనీతం అనే పత్రికకు సంపాదకీయం చేసి ప్రచురించాడు.

సూర్యనారాయణ రావు (ఉపాధ్యాయుల లేదా పాఠకులకు "ఊసు") వ్యంగ్య రచనలకు ప్రసిద్ది. ది అడ్వర్టైజర్ పత్రిక ప్రత్యేక సంచికలో, "నా కాలంలో గురజాడ జాడలు" అనే గురజాడ అప్పారావుతో ఊహాత్మక ఇంటర్వ్యూను ప్రచురించాడు.

అతను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన "కాబూలివలా" ను తెలుగు వేదికగా షాడో నాటకంగా అనువదించాడు. అతని మరో నాటకం, విజయనగర వైభవము ఆల్ ఇండియా రేడియోలో దాని ఫర్ యూనివర్సిటీస్ కార్యక్రమంలో ప్రసారం చేయబడింది. అతను సోమర్సెట్ మౌఘం యొక్క నాటకం పెనెలోప్ ను తెలుగులోకి పంకజాక్షిగా అనువదించాడు, ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికగా ప్రచురిచ్మబడింది. తరువాత ఇది పుస్తక రూపంలో ప్రచురించబడింది. అతను తెలుగులోకి అనువదించాడు.

మూలాలు[మార్చు]

  • The Registrar of Newspapers of India, Government of India lists NAVANITHAM as a monthly published by U Suryanarayana Rao in Vizianagaram. It also lists The Advertiser as a weekly published by K Nageswara Rao in the same district.