ఊటుకూరు సత్యనారాయణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊటుకూరు సత్యనారాయణరావు
జననంమార్చి 14, 1905
మరణం1981
జాతీయతభారతీయుడు
వృత్తికవి, నాటక , సినిమా రచయిత

ఊటుకూరు సత్యనారాయణరావు (మార్చి 14, 1905 - 1981) ప్రముఖ కవి, నాటక, సినిమా రచయిత.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

సత్యనారాయణరావు 1905, మార్చి 14న అచ్యుతరావు, రంగనాయకమ్మ దంపతులకు కృష్ణాజిల్లా, గంపలగూడెం సమీపంలోని ఆర్లపాడు గ్రామంలో జన్మించాడు.

రచనా ప్రస్థానం[మార్చు]

గుహుడు, బాష్పాంజలి, ఉదయరేఖలు వంటి పద్యకావ్యాలు రచించాడు.

నాటకాలు[మార్చు]

బందా కనకలింగేశ్వరావు ప్రోత్సాహంతో నాటక రచనను ప్రారంభించి 12 నాటికలు రాశాడు.

  1. పాషాణి (1937)
  2. ఛత్రపతి శివాజీ (1940)
  3. వీరాభిమన్యు (1940)
  4. వసంతసేన (1941)
  5. అనార్కలి (1941)
  6. ద్రౌపది (1943)
  7. ఫిరదౌసి (1955)
  8. కర్ణధారి (1957)

సినిమాలు[మార్చు]

మాయా మచ్ఛీంద్ర (1943) చిత్రానికి మాటలు, పాటలు అందించాడు.

బహుమతులు[మార్చు]

ఉత్తమ రచన - వీరాభిమన్యు - నంది నాటక పరిషత్తు - 2005 - విజయవాడ

మరణం[మార్చు]

సత్యనారాయణరావు [1981]లో గంపలగూడెంలో మరణించారు.

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.624.