ఎం.డి.అబ్దుల్ హఫీజ్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.డి.అబ్దుల్ హఫీజ్ ఖాన్
ఎం.డి.అబ్దుల్ హఫీజ్ ఖాన్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం కర్నూలు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 31 జనవరి 1977
కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు మొహమ్మద్‌ అబ్దుల్‌ మోయీజ్‌ ఖాన్‌
సంతానం కుమారుడు, కుమార్తె
నివాసం కర్నూలు

మొహమ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

అబ్దుల్ హఫీజ్ ఖాన్ 31 జనవరి 1977లో కర్నూలు లో జన్మించాడు. ఆయన అమెరికాలోని డెట్రాయిట్‌ యూనివర్సిటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. హఫీజ్ ఖాన్ విద్యాభాస్యం ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక డెట్రాయిట్‌లో కంప్యూటర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ లో 2003 నుంచి 2011 వరకు సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్‌ 2011లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్ గా పని చేశాడు. 2014లో కర్నూల్ నుండి గెలిచిన ఎస్వీ మోహన్‌రెడ్డి టీడీపీలో చేరిన అనంతరం ఆయన కర్నూలు నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తగా నియమితుడయ్యాడు.

మొహమ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్‌ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీజీ భరత్ పై 5,353ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "Kurnool Constituency Winner List in AP Elections 2019 | Kurnool Constituency MLA Election Results 2019". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  2. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.