కంచర్ల సుబ్బానాయుడు (పాత్రికేయుడు)
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కంచర్ల సుబ్బానాయుడు | |
---|---|
జననం | కంచర్ల సుబ్బానాయుడు 1965 మే 29 సంగం గ్రామం, సంగం మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
నివాస ప్రాంతం | సంగం |
ఇతర పేర్లు | కంచర్ల,కంసుడు, కేసు, సృజన, జ్యోతిశ్రీ, సేవా నాయుడు, రచయిత, పాత్రికేయుడు, తెలుగు భాష, సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ 'సేవ ' వ్యవస్థాపక అధ్యక్షుడు |
మతం | హిందూమతం |
భార్య / భర్త | తులసి జ్యోతి |
పిల్లలు | నవీన్ నిశ్చల్ |
తండ్రి | కంచర్ల నారాయణ |
తల్లి | కంచర్ల సుబ్బమ్మ |
కంచర్ల సుబ్బానాయుడు పాత్రికేయుడు, రచయిత, కవి, సేవ సంస్థ స్థాపకుడు. పత్రిక, సాహిత్య రంగంలో సుపరిచితులు. కళా పరిషత్తులు, పత్రికలు, సాహితీ కార్యక్రమాలు నిర్వహించటంలో ప్రసిద్దులు. తెలుగు భాష, సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ 'సేవ' ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంతర్జాల జూమ్ వేదికగా యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారంగా కవితా వసంతం, కవితా గ్రీష్మం, కవితా వర్షం, కవితా శరం, కవితా హేమంతం, కవితా శిశిరం ఋతువుల పేర్లతో కవి సమ్మేళనములు, అక్షరార్చన, తెలుగు భాషా వారోత్సవాలు,పంచ సహస్ర తెలుగు సాహితీ సప్తాహం,షడ్రుచులు అన్ని తెలుగు సాహితీ ప్రక్రియల సమ్మేళనాలు, మహిళా వారోత్సవాలు,బాల సాహిత్య సదస్సులు, అవధానములు,ముఖాముఖీలు, 2023 ఉగాది నుండి 365 రోజులు అక్షర తోరణం పేరిట ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం దాకా వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం పునః మూల్యాంకణం చేస్తూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు.సుప్రసిద్ధ రచయితలు, కవుల సాహిత్యంపై సదస్సులు, సాహితీ సప్తాహాలు, సాహితీ సమాలోచన, సాహితీ అవలోకనం కార్యక్రమాలు అనునిత్యం నిర్వహించి చరిత్ర సృష్టించారు.
జీవిత విశేషాలు[మార్చు]
కంచర్ల సుబ్బానాయుడు 1965, మే 29 న కంచర్ల నారాయణ, కంచర్ల సుబ్బమ్మ దంపతులకు నెల్లూరు జిల్లా సంగం గ్రామంలో జన్మించాడు. కంచర్ల, కంసుడు, కేసు, సృజన, కేసు, రాక్షసుడు, ఘంటాసురుడు, జ్యోతిశ్రీ కలం పేర్లతో వివిధ పత్రికల్లో వేలాది వ్యాసాలు అనేక రచనలు చేశారు. పాత్రికేయులు ఎ.బి. కె. ప్రసాద్, ఎం.వి. ఆర్. శాస్త్రి, ఆర్వి రామారావు, టి.యస్. ప్రకాష్, కనకాంబర రాజు, రెంటాల కల్పన, సతీష్ చంద్, అఫ్సర్, రాఘవ శర్మ, వాసుదేవరావు, గజ్జల మాల్లారెడ్డి, రామచంద్రమూర్తి, పొత్తూరు వెంకటేశ్వరావు, సర్వేపల్లి రామమూర్తి, ఎం.సుబ్రహ్మణ్యం, ఐ.నా.రే., తుంగా రాజగోపాల్, నెల్లూరు రామమూర్తి, ఆకుల సుబ్రహ్మణ్యం, ధనికుల నరసింహం, పీవీ ఆర్కే ప్రసాద్, నాగభైరవ కోటేశ్వరరావు, వెన్నెలకంటి గార్ల నుండి ఎంతో నేర్చుకొన్నట్టు కంచర్ల చెపుతారు. వీరందరి ప్రభావం కంచర్ల మీద ఉంది.
విద్యాభాసం[మార్చు]
నెల్లూరు జిల్లా సంగంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (బాస్టాండు బడి)లో 5వ తరగతి వరకు, గొట్టిగుండాల బాలకృష్ణారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు ఉన్నత విద్యనభ్యసించాను. భవాని ఐటీఐ, నెల్లూరు పాలటెక్నీక్, సెట్ నెల్ SETNELలో సాంకేతిక విద్యనభ్యసించారు. తిరుపతిలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశారు.
వృత్తి[మార్చు]
1981లో 16వ ఏట నుంచే పాత్రికేయ వృత్తిని ఆరంభించారు. విలేకరి స్థాయి నుంచి సంపాదకుని స్థాయి వరకు పత్రికా రంగంలో ఎదిగారు. మండలకేంద్రమైన సంగంలో మొట్టమొదట ప్రజా ప్రింటర్స్ పేరుతో ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. ప్రెస్ నడుపుకొంటూ నెల్లూరు కాలింగ్, జమీన్ రైతు, లాయర్, అపరాజిత, సాయంకాలం, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి పత్రికల్లో విలేకరిగా, జిల్లా స్థాయి విలేకరిగా పనిచేశారు. అనతి కాలంలో నెల్లూరులో కళ ఆర్ట్ ప్రింటర్స్ నెలకొల్పారు. నెల్లూరు నుంచి మన పత్రిక అనే స్థానిక పత్రికను నడిపారు. 07-07-2007 వతేదీ తిరుపతిలో " సేవ" అనే దినపత్రికను ఆరంభించారు. 'సేవ' తెలుగు పత్రికకు ప్రధాన సంపాదకుడిగా, ప్రచురణకర్తగా కొనసాగుతున్నారు.
ప్రవృత్తి[మార్చు]
సేవ పేరుతో తెలుగు భాష, సాహితీ సాంస్కృతిక సేవా సంస్థను స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వీరి సాహితీ సేవలు అత్యద్భుతం. 1989లో నెల్లూరునందు కళ సంస్ధ పేరుతో నాటక కళా పరిషత్తును నిర్వహించారు. కళా రంగంలో దర్శకులు, ప్రయోక్త, గుణ నిర్ణేతగా రాణించారు. సేవ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంతర్జాల జూమ్ వేదికగా యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారంగా అక్షరార్చన, తెలుగు భాషా వారోత్సవాలు, సహస్ర సాహితీ సప్తాహం, మహిళా వారోత్సవాలు, ముఖాముఖీలు, 2023 ఉగాది నుండి 365 రోజులు అక్షర తోరణం పేరిట ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం దాకా వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం పునః మూల్యాంకణం చేయడంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. సుప్రసిద్ధ రచయితలు, కవుల సాహిత్యంపై సదస్సులు, సాహితీ సప్తాహాలు, సాహితీ సమాలోచన, సాహితీ అవలోకనం కార్యక్రమాలు అనునిత్యం నిర్వహించి చరిత్ర సృష్టించారు. ఋతువుల పేర్లతో కవితా వసంతం, కవితా గ్రీష్మం, కవితా వర్షం, కవితా శరం, కవితా హేమంతం, కవితా శిశిరం ఋతువుల పేర్లతో కవి సమ్మేళనములను అంతర్జాలంలోని, భౌతిక కార్యక్రమములు గాను అనేకం నిర్వహించారు. తిరుపతి, హైదరాబాద్, నెల్లూరు, అంతర్వేది, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, మంచిర్యాలలో సేవ ఆధ్వర్యంలో వీరు నిర్వహించిన సాహితీ కార్యక్రమాల్లో సుప్రసిద్ధ సాహితీ వేత్తలు, ప్రముఖ కవులు, రచయితలు పాల్గొన్నారు. సేవ అక్షర తోరణం పేరున నిర్వహించే సాహితీ కార్యక్రమాలు అద్భుతం. తెలుగు సాహితీ పితామహుల పొత్తిళ్ళలో పెరిగిన మన తెలుగు భాష గొప్పవిషయాలను, సమగ్ర తెలుగు సమాచారాన్ని, కళలను సాహిత్యాన్ని, తెలుగుకు సంబంధించిన సకల సమాచారాన్ని, తాజా విశేషాలను ఒక చోట భద్రపరచాలనే సంకల్పంతో తెలుగు ఈ’ http://telugue.net/, http://www.sevalive.com/ Archived 2023-11-19 at the Wayback Machine అంతర్జాల పత్రికలను నడుపుతున్నారు.