కన్నెగంటి జగ్గయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్నెగంటి జగ్గయ్య

కన్నెగంటి జగ్గయ్య ఒక ప్రముఖ హేతువాది. స్వాతంత్ర్య పోరాట రైతు యోధుడు. జననం. (1900-1970) గుంటూరు మండలములోని తెనాలి వద్దగల ఐతానగర్లో ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించాడు. బాల్యమునుండి విప్లవాత్మక భావములు గల జగ్గయ్య ద్రావిడ ఉద్యమ స్థాపకుడు ఈరోడ్ వెంకట రామస్వామి నాయకర్ రచనల వల్ల ప్రభావితుడయ్యాడు.

ఉద్యమంలో పాత్ర[మార్చు]

కన్నెగంటి జగ్గయ్య తెలుగునాట ద్రావిడ ఉద్యమము వ్యాప్తి చేయుటకు శ్రమించాడు. ఎప్పుడూ లుంగీ ద్రావిడ దేశ పద్ధతిలో ధరించేవాడు. చేతిలో కర్రతో బనీనుతో ఎక్కువగా తిరిగేవాడు. పలు కారణముల వల్ల తెలుగు నాట ద్రావిడ ఉద్యమము వేళ్ళూనుకొనలేదు. 1926లో తెనాలిలో త్రిపురనేని రామస్వామితో పరిచయం కాగా, ఆయన అభిమానిగా జీవితమంతా ఉన్నాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ కాగా రాయవెల్లూరులో జైల్ జీవిథం గడిపి, ఆహారం సరిగాలేనందుకు అధికారులపై పోరాడాడు.

1932లో కరాచిలో జరిగిన కాంగ్రెస్స్ సభలకు వెళ్ళాడు. ఆవుల గోపాల కృష్ణమూర్తి అభిమానిగా మానవ వాద వుద్యమానికి సహకరించాడు. సహజంగా ధైర్య శాలిఅయిన జగ్గయ్య శిస్తుల విషయంలో రైతులకు అన్యాయం జరిగినప్పుదు అధికారులపై తిరుగుబాటు చేసి వారికి న్యాయం జరిగేదాకా పోరాడాడు.

రచనలు[మార్చు]

  • ఆర్యుల రహస్యాలు వెల్లడించిన ధీరులు (1973)
  • రావణలీల