కాజా శరత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాజా శరత్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
-

వ్యక్తిగత వివరాలు

జననం (1971-01-29) 1971 జనవరి 29 (వయసు 53)
భద్రాచలం, భద్రాద్రి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు సీతారామయ్య, లలితాంబ
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ

కాజా శరత్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 జులై 25న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కాజా శరత్ 1971 జనవరి 29న తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి జిల్లా, భద్రాచలంలో సీతారామయ్య, లలితాంబ దంపతులకు జన్మించాడు. ఆయన భద్రాచలంలో పాఠశాల విద్యతో పాటు డిగ్రీని పూర్తి చేశాడు. కాజా శరత్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ లో ఎంఏ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని ఉస్మానియాలో ఎల్‌ఎం పూర్తి చేశాడు.

వృత్తి జీవితం[మార్చు]

కాజా శరత్ ఎల్‌ఎం పూర్తి చేసి1997లో బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకొని కొత్తగూడెం, భద్రాచలం జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్ ప్రారంభించి 2002 నుండి హైకోర్టులో అన్ని రకాల కేసుల్లోనూ వాదనలు వినిపించాడు. ఆయననుతెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 జులై 25న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3]

2022 ఆగస్టు 16న హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ సమక్షంలో న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (26 July 2022). "హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలు". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  2. Eenadu (26 July 2022). "హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  3. Andhra Jyothy (25 July 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  4. telugu, NT News (2022-08-16). "హైకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం". Namasthe Telangana. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.
"https://te.wikipedia.org/w/index.php?title=కాజా_శరత్&oldid=4066441" నుండి వెలికితీశారు