Coordinates: 16°21′11″N 77°32′30″E / 16.35306°N 77.54167°E / 16.35306; 77.54167

శ్రీపాద శ్రీ వల్లభ దేవాలయం (కురుపురం)

వికీపీడియా నుండి
(కురుపురం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  • kurvapur
  • కురుపురం
శ్రీపాద శ్రీ వల్లభ దేవలయం
kurvapur కురుపురం is located in Telangana
kurvapur కురుపురం
  • kurvapur
  • కురుపురం
తెలంగాణ లోని ప్రదేశం
భౌగోళికాంశాలు:16°21′11″N 77°32′30″E / 16.35306°N 77.54167°E / 16.35306; 77.54167
పేరు
స్థానిక పేరు:
  • shripada srivallabha temple
  • శ్రీపాద శ్రీ వల్లభ దేవలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:మహబూబ్ నగర్ జిల్లా
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శ్రీపాద శ్రీ వల్లభ
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం
వెబ్‌సైటు:www.sripadavallabha.org

శ్రీ దత్తాత్రేయ మొదటి అవతారంగా భావించే శ్రీపాద శ్రీ వల్లభ దేవాలయం కర్ణాటక రాష్ట్రం రాయిచూరు జిల్లాకు చెందిన కురుపురంలో ఉంది. ఈ ఆలయం తెలంగాణ, కర్ణాటకరాష్ట్రాల సరిహద్దులో, కృష్ణా నది మధ్యలో గల ద్వీపంలో ఉంది. పాదుకా రూపంలో దర్శనం ఇస్తున్నారు. ఈ గ్రామాన్ని కురుగడ్డి, కురువాపూర్, కురుగడ్డ అంటారు.[1]

మత ప్రాముఖ్యత[మార్చు]

శ్రీపాద శ్రీ వల్లభ తన జీవితంలో చాలా కాలం ఇక్కడే నివసించాడు. ఇక్కడ అనేక లీలలు చేశాడు అని శ్రీ గురు చరిత్ర, ఇతర పవిత్ర పుస్తకాలలో ఉంది. గురుచరిత్ర ప్రకారం కురుపురం సందర్శించిన వారిని, అన్ని సమస్యలను నుండి విముక్తి కలుగుతుంది, ఆరోగ్యం బాగుపడి, సంపన్న జీవితం గదుపుతారు. ఇక్కడ శ్రీ తెంబే స్వామి ధ్యానం చేసే గుహ ఉంది. కురుపురం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

ఎలా చేరాలి?[మార్చు]

కురుపురం చేరుకోవడానికి తరచుగా ఉపయోగించే రెండు మార్గాలున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్ ద్వారా ఒకటి. మరొకటి తెలంగాణ రాష్ట్రంలో మక్తల్ ద్వారా ఉంది. ఎటునుండి వెళ్ళినా ఈ ద్వీపం చేరుకోవడానికి పుట్టి లేదా తెప్ప ద్వారా కృష్ణానదిని దాటాలి.

రాయచూరు మార్గం[మార్చు]

రాయచూర్, పూనే నుండి రైలు ద్వారా 10 లేదా 12 గంటల ప్రయాణం. రాయచూరులో రైలు దిగి అత్కూర్ (40 కిలోమీటర్ల) వరకు బస్సులు, రిక్షాలూ నడుస్తూంటాయి. గుల్బర్గాకు వెళ్ళే రహదారిపై మసీదు తర్వాత కుడి మలుపు తీసుకొన్నాకదాదాపు 35 కిలోమీటర్ల దూరంలో దేవాలయం ఉంది. పుట్టి లేదా తెప్ప ద్వారా కృష్ణా నదిని దాటుతారు. కావున సాయంత్రం 4 గంటల లోపు ప్రయాణం పూర్తి చేసుకోవాలి.

మక్తల్ నుండి మార్గం[మార్చు]

మక్తల్ (మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ) మహబూబ్ నగర్ బస్సు స్టేషన్ నుండి 68 కిలోమీటర్ల దూరంలోను, హైదరాబాదు నుండి 168 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ నుండి రాయచూరు వెళ్ళే బస్సులు కొన్ని, మక్తల్ వద్ద ఆగుతాయి. మక్తల్ నుండి కృష్ణ నది ఒడ్డుకు, ఆటో లేదా టాక్సీ (జీప్) ద్వారా చేరుకోవచ్చు. కృష్ణా నది ఒడ్డు నుండి మక్తల్ 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిన్న పడవలు (పుట్టి లేదా తెప్ప) అద్దెకు తీసుకొనవచ్చు ఇక్కడ నది ఒడ్డున రెండు స్థానాలు ఉన్నాయి. వన్ పంచదేవ్ పహాడ్, మరొక ఒక విఠల్ బాబా ఆశ్రమం వెనుక, ఆశ్రమం నుండి 1 కి.మీ. దూరంలో ఉంది.వర్షా కాలంలో కృష్ణా నదిలో నీరు నిండుగా ఉన్నప్పుడు, విఠల్ బాబా ఆశ్రమం సమీపంలో పుట్టి లేదా తెప్పల సంఖ్య తక్కువ ఉంటుంది. ప్రయాణం కూడా ప్రమాదకరం.

మూలాలు[మార్చు]

  1. "శ్రీపాద శ్రీ వల్లభ దత్తాత్రేయ దేవాలయం- చరిత్ర". Archived from the original on 2015-11-21. Retrieved 2015-12-03.

ఇతర లింకులు[మార్చు]