గడ్డం రుద్రమ దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గడ్డం రుద్రమ దేవి

పదవీ కాలం
1985 - 1989
ముందు ఎన్.టి.రామారావు
తరువాత ఎం. రఘుమారెడ్డి
నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
నల్గొండ, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

గడ్డం రుద్రమ దేవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆమె నల్గొండ నియోజకవర్గం నుండి 1985 నుండి 1989 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.

రాజకీయ జీవితం[మార్చు]

గడ్డం రుద్రమ దేవి రాజకీయ కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చి 1980లో నల్లగొండ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో 20ఏళ్లకే కౌన్సిలర్‌గా గెలిచింది. నందమూరి తారకరామారావు 1981లో టీడీపీని స్థాపించి నల్లగొండకు వచ్చిన సందర్భంలో ఆమెను పార్టీలోకి ఆహ్వానించడంతో టీడీపీలో చేరింది. ఆమె 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గుత్తా మోహన్ రెడ్డి చేతిలో 6639 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది.[1]

1985లో టీడీపీ ప్రభుత్వంలో సంక్షోభం నేపద్యంలో నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు పోయారు.[2] ఎన్టీఆర్‌ నల్లగొండతో పాటు మూడు చోట్ల పోటీ చేసి విజయం సాధించి నల్లగొండ అసెంబ్లీకి రాజీనామా చేయడంతో తిరిగి జరిగిన ఉప ఎన్నికల్లో గడ్డం రుద్రమ దేవి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా మోహన్ రెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[3]

మూలాలు[మార్చు]

  1. Election Commission of India (2004). "Partywise Comparison Since 1978". Archived from the original on 12 December 2021. Retrieved 12 December 2021.
  2. Eenadu (11 November 2023). "9 స్థానాల్లో.. 12 సార్లు ఉప ఎన్నికలు." Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  3. Sakshi (30 November 2018). "మా కుటుంబం.. పోరాటాలకు పుట్టినిల్లు: గడ్డం రుద్రమ దేవి". Archived from the original on 12 December 2021. Retrieved 12 December 2021.