గరుడ బేతరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మొదటి బేతరాజు (:996-1051) పశ్చిమ చాళుక్యులకు సామంతునిగా వ్యవహరించాడు. హన్మకొండ ఇతనే అని అభిప్రాయంఉంది. ఇతనిని గరుడ బేతరాజు అని కూడా వ్యవహరిస్తారు. అతనికి "చోళచమూవార్థి ప్రమదన" అనే బిరుదు ఉంది.[1]

అతను గుండ్యన కుమారుడు. అతని తండ్రి గుండ్యన చనిపోయేనాటికి అతను పిన్నవాడు. అతని మేనత్త కామసాని అతనికి అండగా వుండి, తన భర్త ఐన చాళుక్య సేనాని ఎర్రన ద్వారా చాళుక్య చక్రవర్తి చేత అనుమకొండ పై ఆధిపత్యం ఇప్పించింది. ఈవిధంగా కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు విధేయ సామంతులుగా అనుమకొండ విషయాధినేతలయ్యారు.
మొదటి బేతరాజు 1051 వరకు జీవించి వున్నట్టు, అనగా 50 సంవత్సరాలకు పైగా ఏలాడని, శాసనాలు తెల్పుతున్నాయి. తని సేనాని రేచర్ల బ్రహ్మ చాళుక్య త్రైలోక్య సోమేశ్వరుని తరపున చోళరాజధాని కంచి పై దాడి చేశాడు.

గరుడ బేతరాజు కుమారుడు మొదటి ప్రోలరాజు. ఇతను 1053 లో "శనిగరం" శాసనం వేయించాడు.

రేచర్ల బమ్మసేనాని కాకతీయ మొదటి (గరుడ) బేతరాజు వద్ద సేనాధిపతిగా పనిచేసి కాంచీపుర చోళులను జయించాడు. పాలంపేట, పిల్లలమర్రి, చిట్యాలంపాడు, మాచాపూర్ శాసనాలు ఇతడి గురించి తెలుపుతున్నాయి. [2]

మూలాలు[మార్చు]

  1. "కాకతీయులు - Sakshi Education".{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "కాకతీయుల సామంతులు". www.notificationsadda.in. Retrieved 2020-07-17.

వనరులు[మార్చు]

  • ఆంధ్రుల చరిత్ర,, తెలుగు అకాడమి ప్రచురణ
  • ఆంధ్ర దేశ చరిత్ర - సంస్కృతి,, తెలుగు అకాడమి ప్రచురణ