చాళుక్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350
ఆనందగోత్రికులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550
పూర్వమధ్య యుగము 650 – 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 – 1076
పూర్వగాంగులు 498 – 894
చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
అరవీటి వంశము 1572–1680
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

చాళుక్యులు దక్షిణభారత దేశాన్ని సా.శ. 6 - 12 శతాబ్ధాల మధ్య పరిపాలించిన రాజులు. వీరు ముఖ్యంగా భారతదేశంలోని ప్రస్తుత కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు. సా.శ. 2వ శతాబ్దమునాటి ఇక్ష్వాకుల శాసనములో "కండచిలికి రెమ్మనక" అనువాడు ఇక్ష్వాకుల సామంతుడని ఉంది. ఇక్ష్వాకుల పతనము తర్వాత పల్లవుల ధాటికి తాళలేక వీరు కర్ణాటక ప్రాంతానికి వెళ్ళారు. దుర్గా ప్రసాద్, అడ్లూరి గారి అభిప్రాయములను బట్టి చాళుక్యుల పూర్వీకులు ఆంధ్రులే.[1][2] రెండవ పులకేశి మారుటూరు శాసనములో చాళుక్య విషయము గురించి ప్రస్తావన ఉంది. ఈ చాళుక్య విషయము ప్రస్తుత రాయలసీమలోని కడప - కర్నూలు ప్రాంతము. కర్ణాట దేశమందలి బాదామినేలుతున్న కదంబులనోడించి చాళుక్యులు ఒక మహా సామ్రాజ్యము స్థాపించారు. ఈ బాదామి చాళుక్యులని బౌద్ధులు, ఆర్య క్షత్రియులని కూడా అంటారు.

చాళుక్యులు ప్రధానంగా[3]

  1. బాదామి చాళుక్యులు
  2. తూర్పు చాళుక్యులు
  3. కళ్యాణి చాళుక్యులు
  4. ముదిగొండ చాళుక్యులు
  5. వేములవాడ చాళుక్యులు
  6. యలమంచిలి చాళుక్యులుగా పాలన కొనసాగించారు.

చాళుక్యులు తెలంగాణముగుండా తిరిగి ఆంధ్రదేశము ప్రవేశించి వేములవాడ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, చాళుక్య చోళులు మున్నగు శాఖలుగా పరిపాలన చేశారు.

చాళుక్యుల వంశవృక్షం[మార్చు]

జయసింహ[4]రణరాగమొదటి పులకేశి 
(సా.శ.. 535 - 566)
↓
↓———————————————————————————————————————————————↓
కీర్తివర్మన్ మంగవేశ
(సా.శ.. 566 - 597) (సా.శ.. 597 - 610)
↓
↓—————————————————————————————————————↓——————————————————————————————————↓
రెండవ పులకేశి కుబ్జా విష్ణువర్ధనుడు దారాశ్రయ జయసింహ
( సా.శ.. 610-6420) (తూర్పుచాళుక్య/ వేంగి శాఖ) 
↓ 
↓———————————————↓———————————————↓———————————————————↓————————————————————————————————↓
ఆదిత్య వర్మ చంద్రాదిత్య రెండవ రణరాగ మొదటి విక్రమాదిత్యుడు మూడవ జయసింహ 
(సా.శ.. 655- 681) (Lata Branch స్థాపకుడు ) 
↓
వినయాదిత్యుడు 
(సా.శ.. 681 - 696) 
↓
↓————————————————————————————————↓
విజయాదిత్యుడు అరికేసరి
(సా.శ..696- 733) (వేములవాడ శాఖ )
↓ 
↓———————————————————————————————————————————————↓———————————↓
రెండవ విక్రమాదిత్యుడు భీమ తైలపుడు
(సా.శ..733 - 744) ( కళ్యాణి స్థాపకులు)
↓
రెండవ కీర్తివర్మ 
(సా.శ..744- 757) 

పూర్వ చాళుక్యులు[మార్చు]

పూర్వ (తూర్పు) చాళుక్యులు బాదామి పశ్చిమ చాళుక్య వంశమునుండి చీలిన ఒక శాఖకు చెందినవారు. వీరికి మూలపురుషుడు పశ్చిమ చాళుక్య రాజులలో ప్రసిద్ధుడయిన ఇమ్మడి సత్యాశ్రయ పులకేశి పెద్ద తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుడు. పులకేశి సా.శ. 617, 624లలో కళింగ, వేంగీ దేశములు (దుర్జయులను) జయించి వానిపై తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుని పాలకునిగా నియమించాడు. కుబ్జవిష్ణువర్ధనుని పరిపాలనాకాలము క్రీ. శ. 624-641. క్రీ. శ. 631వరకు అన్న పులకేశికి ప్రతినిధిగా పాలించాడు. అప్పటివరకు కృష్ణానదికి దక్షిణము లోని తీరాంధ్రదేశమంతయూ పల్లవుల ఆధీనములోనుండెను. సా. శ. 630లో పల్లవ రాజు మొదటి మహేంద్రవర్మ మరణించాడు. అదే అదనుగా పులకేసి కమ్మనాడు ఆక్రమించి వేంగీ రాజ్యాధిపత్యాన్ని కుబ్జవిష్ణువర్ధనునికి ఇచ్చాడు. కీ. శ. 631 తరువాత పులకేశి మూడుపర్యాయాలు పల్లవ రాజ్యాన్ని అతలాకుతలము చేశాడు. అయితే క్రీ. శ.641లో పల్లవ రాజు మొదటి నరసింహవర్మ బాదామి ముట్టడి చేసి పులకేశిని వధించాడు. అన్నకు సహాయము చేయుటకై వెడలి కుబ్జవిష్ణువర్ధనుడు కూడా మరణించాడని చారిత్రకుల అభిప్రాయము.

కుబ్జవిష్ణువర్ధనుడు అసమానపరాక్రమశాలి. విష్ణుభక్తుడు. విషమసిద్ధి, మకరధ్వజ అను బిరుదాంకితుడు. రాణి అయ్యణ మహాదేవి. ఇతనికి జయసింహవల్లభుడు, ఇంద్రభట్టారకుడు అను ఇద్దరు కుమారులు. వీరు ఒకరితర్వాత ఒకరు సింహాసనము అధిష్ఠించారు.

జయసింహవల్లభుడు సా.శ.. 641నుండి ముప్పది మూడేండ్లు రాజ్యము చేసినను జరిగిన విశేషాంశములు ఏవీ తెలియరావు. సంతతి లేని కారణమున తమ్ముడు ఇంద్రభట్టారకుడు ఏడు దినములు మాత్రమే రాజ్యమేలాడు. అతని కుమారుడు రెండవ విష్ణువర్ధనుడు సా.శ.. 681వరకు తొమ్మిదేండ్లు పాలించాడు. ఇతని వెనుక కొడుకైన మంగి యువరాజు రాజై సా.శ.. 705 వరకు ఇరువది ఐదేండ్లు పాలించాడు. ఇతనికి జయసింహుడు, కొక్కిలి విక్రమాదిత్యుడు, విష్ణువర్ధనుడు అను ముగ్గురు కుమారులున్నారు. వీరు ఒకరి తరువాత ఒకరు రాజ్యము చేశారు. ముమ్మడి విష్ణువర్ధనుడు సా.శ.. 718 నుండి 752 వరకు పాలనము చేశాడు. ఈతని కాలములో పల్లవ జనపద ప్రజలు తమ రాజుగా నందివర్మ పల్లవమల్లుని ఎన్నుకొనిరి. నందివర్మ అద్వితీయ శక్తి సంపన్నుడు. ఇతని అశ్వమేధయాగ సందర్భమున యాగాశ్వము నెల్లూరు మండలములోని బోయకొట్టములు ప్రవేశించెను. అచట విష్ణువర్ధనుని సామంతుడు పృధ్వీవ్యాఘ్రుడు దానిని బంధించాడు. జరిగిన యుద్ధ ఫలితముగా విష్ణువర్ధనుడు తన రాజ్యములోని దక్షిణసీమ కోల్పోయాడు.

కళ్యాణి చాళుక్యులు[మార్చు]

దక్షిణాపథమును నిరంకుశముగా పాలించి ఆంధ్రదేశమును ప్రభావితము చేసిన గొప్ప రాజవంశము కల్యాణి చాళుక్యులు. వీరు బాదామి చాళుక్యుల కోవకు చెందినవారే. చిరకాలము పశ్చిమ తెలంగాణములో రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి తరువాత స్వతంత్రులయ్యారు. సా.శ.. 969లో చివరి రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణ గతించిన పిదప వారి రాజ్యము విచ్ఛిన్నమయింది. కళ్యాణి చాళుక్యులలో మొదటివాడు రెండవ తైలపుడు (సా.శ.. 973-997). ఇతడు ఇరువది ఐదేండ్లు పాలించాడు. పరమారులను, చోళులను, ఘూర్జరులను జయించాడు. తైలపుడు మహాయోధుడు, మంచి పరిపాలకుడు. కన్నడ కవిరత్నత్రయములో ఒకడగు రన్న తైలపుని కొలువులో ఉన్నాడు. తైలప కుమారుడు సత్యాశ్రయుడు. ఇతడు కూడా మహాయోధుడు. చోళులతో వేంగి కొరకు యుద్ధాలు చేశాడు. రాజరాజ చోళుని సామంతుడు శక్తివర్మ చివరకు నెగ్గాడు. పిమ్మట విక్రమాదిత్య, అయ్యన కొలదికాలమే పాలించారు. అయ్యన తమ్ముడు జయసింహుడు వేంగి తిరిగి సాధించుటకు చోళులతో పెక్కు యుద్ధాలు చేశాడు. జైనమతావలంబియగు జయసింహ శైవము స్వీకరించాడు. అప్పటినుండి శైవము కర్ణాటకములో రాజమతమయ్యింది. జయసింహ కుమారుడు మొదటి సోమేశ్వరుడు తండ్రిని మించినవాడు. త్రైలోక్యమల్ల, అహవమల్ల బిరుదులు ధరించాడు. తెలుగు చోళులను, కోట, పరిచ్చేది నాయకులను తన పక్షము చేసుకున్నాడు. ఇతడుకూడ తన ఇరువది ఐదు సంవత్సరముల రాజ్యకాలము చోళులతో యుద్ధములందు గడిపాడు. ఇతనికాలములోనే కాకతీయులు అనుమకొండ విషయమును సామంతులుగా పొందారు. రెండవ సోమేశ్వరుడు, త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు, మూడవ సోమేశ్వరుడు చోళులతో చెసిన యుద్ధములలో వేంగి పలుమార్లు చేతులు మారింది. చివరకు సా.శ.. 1133లో వేంగి కళ్యాణి చాళుక్యుల చేజారిపోయింది. చాళుక్యచోళ సామంతులైన వెలనాటి చోళులు చాళుక్యదండనాయకులను జయించి వేంగిని పాలించసాగారు. ఈ విధముగా తెలుగు దేశము నూట యాభై సంవత్సరములు చాళుక్య, చోళులకు యుద్ధరంగమైనది.

కళ్యాణి చాళుక్య వంశం[మార్చు]

తైలపుడు[5]
(సా.శ..965-997)
↓
↓————————————————————————————————————————↓
సత్యాశ్రయుడు [? ]
(సా.శ..997-1008) ↓
↓ ———————————————————————↓——————————————————————————↓
త్రిభువనమల్ల  విక్రమాదిత్యుడు అయ్యన జగదేకమల్ల  జయసింహుడు
(సా.శ..1008- 1014) (సా.శ..1014-1015) (సా.శ..1015-1043) 
↓
సోమేశ్వరుడు
(సా.శ..1043-1068) 
↓
↓————————————————————————————————————————↓
భువనైకమల్ల  సోమేశ్వరుడు త్రిభువనమల్ల  6వ విక్రమాదిత్యుడు 
(సా.శ..1068-1076) (సా.శ..1076-1126) 
↓
భూలోకమల్ల  సోమేశ్వరుడు-3
(సా.శ..1126-1138) 
↓ 
↓——————————————————————————————————————————↓
ప్రతాప చక్రవర్తి జగదేకమల్లుడు -2 తైలపుడు -3
(సా.శ..1138-1149) (సా.శ..1149-1162)

ముదిగొండ చాళుక్యులు[మార్చు]

పూర్వ మధ్య యుగమున తెలుగు దేశములో వేంగీ చాళుక్యుల పక్షము వహించి, రాష్ట్రకూటులనెదిర్చి, కాకతీయులను కూడా ప్రతిఘటించిన రాజవంశము ముదిగొండ చాళుక్యులు. ఖమ్మం ప్రాంతములోని ముదిగొండ వీరి రాజధాని. కొరివి, బొట్టు కూడా అప్పుడప్పుడు రాజధానులు. ఈ రాజ్యము ఎనిమిదవ శతాబ్దిలో ప్రారంభమై పన్నెండవ శతాబ్దిలో అంతమయినది. వీరు మానవ్యస గోత్రులు, హారితీ పుత్రులు, వరాహ లాంఛనధారులు. వీరు శాసనములలో అయోధ్య నుండి వచ్చినవారుగా చెప్పుకున్నారు. వీరిలో ముఖ్యులు మూడవ కుసుమాయుధుడు, బొట్టు బేతరాజు, కుసుమాదిత్యుడు.

వేములవాడ చాళుక్యులు[మార్చు]

ఇప్పటి కరీంనగరు జిల్లాలోని వేములవాడ రాజధానిగా పాలించిన చాళుక్య రాజవంశమును వేములవాడ చాళుక్యులందురు. తొలుత వీరు ఇందూరు (నిజామాబాద్) ప్రాంతములోని పోదనపురము (బోధన్) నుండి పాలించెడివారు. సాతవాహన సామ్రాజ్యములో అశ్మక రాష్ట్రమునకు ఇది రాజధాని. ఈ ప్రాంతమును సపాదలక్ష, సబ్బినాడు, పోదననాడు అని కూడా అంటారు. సాతవాహనుల తరువాత నాలుగు శతాబ్దముల చరిత్ర తెలియడం లేదు.

రాష్ట్రకూట రాజగు దంతిదుర్గ పోదననాడులో సామంతునిగా వినయాదిత్య యుద్ధమల్లుని (క్రీ. శ. 750-780) నియమించాడు. ఈతడు దంతిదుర్గ దండయాత్రలలో విజయములు సాధించి రాజు మన్ననలు పొందాడు. బాదామి చాళుక్యుల అధికారము కూలద్రోయుటలో యుద్ధమల్లుడు మిక్కిలి తోడ్పడ్డాడు. యుద్ధమల్లుని కుమారుడు మొదటి అరికేసరి (క్రీ. శ. 780-800). ఈతడు గొప్ప విద్వాంసుడు, గజతంత్రము, ధనుర్విద్య, ఆయుర్వేదము మున్నగు విద్యలు నేర్చినవాడు. సమస్తలోకాశ్రయ, త్రిభువనమల్ల, రాజత్రినేత్ర, సాహసరామాది బిరుదులు గలవాడు. ఇతని కొడుకు రెండవ యుద్ధమల్లుడు. ఇతని గురించి విశేషములు తెలియరాలేదు. రెండవ యుద్ధమల్లుని కుమారుడు బద్దెగ మహావీరుడు. రాష్ట్రకూటులకు సాయముగా బద్దెగ, కాకర్త్య గుండన వేంగి పై దాడి చేశారు. బద్దెగ మనుమడు ఇమ్మడి అరికేసరి ఈ వంశములో అందరికంటే గొప్పవాడు. రాష్టకూటులతొ సంబంధములు నెరపి వేంగి, మాన్యఖేటము, కొరవి లలో తన ప్రాబల్యము పెంపు చేశాడు. పసిద్ధ కన్నడ కవి పంప అరికేసరి ఆస్థానములో ఉండి విక్రమార్జునవిజయము అనబడు తొలి కన్నడ కావ్యము రచించాడు. ఇతడు కమ్మనాడుకు చెందిన వాడు.

చాళుక్య చరిత్ర కాలనిర్ణయం[మార్చు]

600 సంవత్సరాలకు పైగా భారతదేశంలో దక్షిణ పీఠభూమిని పాలించారు. ఈ కాలంలో వారు దగ్గరి సంబంధం కలిగి ఉన్న మూడు ప్రత్యేక రాజవంశాలుగా ఉన్నాయి. ఇవి 6 వ, 8 వ శతాబ్దాల మధ్య పాలించిన "బాదామి చాళుక్యులు" (వీరిని "ప్రారంభ చాళుక్యులు" అని కూడా పిలుస్తారు), ఇద్దరు తోబుట్టువుల రాజవంశాలు, "కల్యాణి చాళుక్యులు" (వీరిని పాశ్చాత్య చాళుక్యులు లేదా "తరువాత చాళుక్యులు" అని కూడా పిలుస్తారు) "వేంగి చాళుక్యులు" (వీరిని తూర్పు చాళుక్యులు అని కూడా అంటారు).

బాదామి చాళుక్యులు[మార్చు]

Bhutanatha temple complex, at Badami

6 వ శతాబ్దంలో గుప్తరాజవంశం వారసులు ఉత్తర భారతదేశంలో క్షీణతతో వారు వింధ్యపర్వతాలకు దక్షిణంగా ఉన్న దక్కను పీఠభూమి, పురాతన తమిళ ప్రాంతాలలో ప్రవేశించి విస్తరించడంతో వారు ఆయా ప్రాంతంలో పెద్ద మార్పులు సంభవించడానికి కారణం అయ్యారు. చిన్న రాజ్యాల యుగం ఈ ప్రాంతంలోని పెద్ద సామ్రాజ్యాలకు దారితీసింది.[6] చాళుక్య రాజవంశం 543 లో మొదటి పులకేసి చేత స్థాపించబడింది.[7][8][9] మొదటి పులకేశి వతాపిని (కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలో ఆధునిక బాదామి) స్వాధీనం చేసుకుని దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. మొదటి పులకేశి ఆయన వారసులను "బాదామి చాళుక్యులు" అని పిలుస్తారు. వారు మొత్తం కర్ణాటక రాష్ట్రం, దక్కను లోని అత్యధిక ఆంధ్రప్రదేశు భూభాగంతో చేరిన సామ్రాజ్యాన్ని పాలించారు.

రెండవ పులాకేశి పట్టాభిషేక పేరు ఎరియా[10] ఆయన మొత్తం దక్కను మీద నియంత్రణను సాధించి బహుశా బాదామి రాజవంశం అత్యంత ప్రసిద్ధ చక్రవర్తి అయ్యాడు.[11][12] ఆయన భారతీయ చరిత్రలో గుర్తించదగిన రాజులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[13][14][15] ఆయన అలుపా రాజవంశం (దక్షిణ కెనరా), తలాకాడు పశ్చిమ గంగా రాజవంశం (తలకాడు) యువరాణులను వివాహం చేసుకుని వీరితో సమీప కుటుంబం, వైవాహిక సంబంధాలను కొనసాగించారు.[16][17] రెండవ పులకేశి చాళుక్య సామ్రాజ్యాన్ని పల్లవ రాజ్యం ఉత్తర భాగాల వరకు విస్తరించాడు. దక్షిణ దిశగా సాగించిన విజయయాత్రలో నర్మదా నది ఒడ్డున హర్షవర్ధనుడి చేతిలో ఓడిపోయిన తరువాత ఆదిశలో విజయయాత్రకు అక్కడితో నిలిపివేసాడు. ఆ తరువాత ఆయన ఆగ్నేయ దక్కనులో విష్ణుకుండినులను ఓడించాడు.[18][19][20][21] పల్లవ నరసింహవర్మను 642 లో బాదామి మీద తాత్కాలిక దాడి చేసి ఆక్రమించి ఈ విజయాన్ని తిప్పికొట్టారు. ఈ పోరాటంలో "గొప్ప హీరో" అయిన రెండవ పులకేశి పోరాటంలో మరణించాడని భావించబడుతుంది.[22][23]

రెండవ పులాకేశి మరణించిన తరువాత పదమూడు సంవత్సరాల కాలానికి బడామిని పల్లవులు ఆక్రమించినసమయంలో అంతర్గత వైరుధ్యాల కారణంగా బాదామి చాళుక్య రాజవంశం కొంతకాలం క్షీణదశను అనుభవించింది.[24][25] పల్లవులను బాదామి నుండి బయటకు నెట్టి, సామ్రాజ్యక్రమాన్ని పునరుద్ధరించడంలో విజయం సాధించిన విక్రమాదిత్య పాలనలో ఇది కోలుకుంది. మొదటి విక్రమాదిత్య "రాజమల్లా" ​​ ("మల్లాసు సార్వభౌమాధికారి" లేదా పల్లవులను అంతమొదించిన) అనే బిరుదును తీసుకున్నాను.[26] విజయాదిత్య (696–733) 37 సంవత్సరాల సుసంపన్నమైనది పాలన చేసాడు. ఆయన పాలనలో ప్రసిద్ధ ఆలయాలు నిర్మించబడ్డాయి.[27][28]

ప్రఖ్యాత రెండవ విక్రమాదిత్య (733–744) పాలనలో ఈ సామ్రాజ్యం తిరిగి శిఖరాగ్రం చేరుకుంది. ఆయన తొండైమండలం భూభాగం మీద పదేపదే దండయాత్రలు చేసి పల్లవ రెండవ నందివర్మను మీద సాధించిన విజయాలకు, ప్రజల పట్ల ఆయన చూపిన దయాదాక్షిణ్యాలకు, పల్లవ రాజధాని కాంచిపురం స్మారక చిహ్నాలు నిర్మించినందుకు కూడా పేరుగాంచాడు.[27][29][30] ఈ విధంగా ఆయన పల్లవులు గతంలో చాళుక్యులను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. కైలాసనాథ ఆలయంలో విజయ స్తంభం మీద కన్నడ శాసనాన్ని చెక్కాడు. [29][31][32] ఆయన పాలనలో దక్షిణ గుజరాతు మీద అరబు చొరబాటుదారుడు ఉమయ్యదు కాలిఫేటు దాడి చేశాడు. చాళుక్య పాలనలో ఉన్న నవ్సరీ చాళుక్య గవర్నరు పులకేసి అరబ్బులను ఓడించి తరిమికొట్టాడు.[33] తరువాత ఆయన కలాభ్రా పాలకుడిని లొంగదీసుకోవడంతో పాటు తమిళ దేశంలోని ఇతర సాంప్రదాయ రాజ్యాలు, పాండ్యాలు, చోళులు, చేరాలను అధిగమించాడు.[34] చివరి చాళుక్య రాజు రెండవ కీర్తివర్మనుని 753 లో రాష్ట్రకూట రాజు దంతిదుర్గ పడగొట్టాడు.[35] వారి శిఖరాగ్రస్థాయిలో చాళుక్యులు దక్షిణాన కావేరి నుండి ఉత్తరాన నర్మదా వరకు విస్తరించి ఉన్న విస్తారమైన సామ్రాజ్యాన్ని పరిపాలించారు.

కల్యాణి చాళుక్యులు[మార్చు]

దక్కను చాలావరకు రాష్ట్రకూటుల పాలనలో 200 సంవత్సరాల నిద్రాణస్థితిలో ఉన్న తరువాత 973 లో చాళుక్యులు తమ అదృష్టాన్ని పునరుద్ధరించారు. ఈ సామ్రాజ్యం రాజుల వంశవృక్షం ఇప్పటికీ చర్చనీయాంశమైంది. ఒక సిద్ధాంతం సమకాలీన సాహిత్య, శాసనాత్మక ఆధారాలు, పశ్చిమ చాళుక్యులు ప్రారంభ చాళుక్యులు సాధారణంగా ఉపయోగించే బిరుదునామాలను ఉపయోగించారని కనుగొన్న తరువాత పశ్చిమ చాళుక్య రాజులు 6 వ శతాబ్దపు ప్రసిద్ధ బాదామి చాళుక్య రాజవంశం కుటుంబ శ్రేణికి చెందినవారని సూచిస్తుంది.[36][37] ఇతర పశ్చిమ చాళుక్య శిలాశాసనాలు అవి ప్రారంభ చాళుక్యులతో సంబంధం లేని ఒక ప్రత్యేకమైన వంశావళి అని సూచిస్తున్నాయి.[38]

రెండవ తైలాపా తార్దావడి - 1000 (బీజాపూరు జిల్లా) రాష్ట్రకూట భూస్వామ్యరాజ్యాధిపతి కర్కాను పడగొట్టి పశ్చిమ దక్కనులో చాళుక్య పాలనను తిరిగి స్థాపించి పశ్చిమదక్కనులో తిరిగి చాళుక్య సామ్రాజ్య ఆధిపత్యాన్ని తిరిగి స్థిరపరిచాడు.[39][40] పశ్చిమ చాళుక్యులు 200 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. వీరు చోళులు, వారి బంధువులతో, వేంగి తూర్పు చాళుక్యులతో నిరంతరం సంఘర్షణలు కొనసాగించారు. రెండవ విక్రమాదిత్య రాజవంశంలో అత్యంత ప్రసిద్ధ పాలకుడిగా పరిగణించబడ్డాడు.[41][42] 50 సంవత్సరాల పాటు కొనసాగిన తన పాలన ప్రారంభంలోనే ఆయన అసలు సాకా శకాన్ని రద్దు చేసి విక్రమయుగాన్ని స్థాపించాడు. ఈ కొత్త యుగంలో అనేక చాళుక్య శాసనాలు ఉన్నాయి.[43][44] రెండవ విక్రమాదిత్య ప్రతిష్ఠాత్మక, నైపుణ్యం కలిగిన సైనిక నాయకుడు. ఆయన నాయకత్వంలో పాశ్చాత్య చాళుక్యులు వేంగి (తీర ఆంధ్ర)మీద చోళుల ప్రభావాన్ని అంతం చేసి దక్కనులో ఆధిపత్య శక్తిగా మారాడు.[45][46] కన్నడ సాహిత్యం, సంస్కృత సాహిత్యం అభివృద్ధిలో పాశ్చాత్య చాళుక్య కాలం ఒక ముఖ్యమైన యుగంగా గుర్తించబడింది.[47][48] 12 వ శతాబ్దం చివరలో హొయసల సామ్రాజ్యం, పాండ్యులు, కాకతీయ, దేవగిరి సీనా యాదవుల పెరుగుదలతో వారు తమ క్షీణదశకు చేరుకున్నారు.[49]

వేంగీ చాళుక్యులు[మార్చు]

616 లో ఆధునిక ఆంధ్రప్రదేశు తీరప్రాంత జిల్లాలు, విష్ణుకుండినా రాజ్యం అవశేషాలను ఓడించాయి. ఆయన తన సోదరుడు కుబ్జ విష్ణువర్ధనను 621 లో రాజప్రతినిధిగా నియమించాడు.[50][51] అందువలన తూర్పు చాళుక్యులు మొదట కన్నడ హూభాగానికి చెందినవారు.[52] రెండవ పులకేషిశి మరణం తరువాత, వెంగీ ప్రతినిధిత్వ స్థాయి నుండి స్వతంత్ర రాజ్యంగా అభివృద్ధి చెంది తన రాజ్యపరిధిలో నెల్లూరు విశాఖపట్నం మధ్య ప్రాంతాన్ని విలీనం చేసుకుంది.[51][53]

8 వ శతాబ్దం మధ్యలో బాదామి చాళుక్య సామ్రాజ్యం క్షీణించిన తరువాత, రాష్ట్రకూటాలు, పశ్చిమ దక్కను కొత్త పాలకులు, తూర్పు చాళుక్యుల మధ్య ప్రాదేశిక వివాదాలు చెలరేగాయి. తరువాతి రెండు శతాబ్దాలలో తూర్పు చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులై కప్పం చెల్లించవలసిన పరిస్థితి పట్ల అధీనతను అంగీకరించాల్సి వచ్చింది.[54] రెండవ విజయాదిత్య (c.808–847) వంటి అరుదైన సైనిక విజయం కాకుండా, మొదటి భీముడు (c.892–921) పాలనలో మాత్రమే ఈ చాళుక్యులు స్వాతంత్ర్య రాజ్యంగా ఆధిపత్యం నిలుపుకున్నారు. మొదటి బీమా మరణం తరువాత రాష్ట్రకూటులు ఆంధ్ర ప్రాంతంలో వెంగి వ్యవహారాలలో వరుస వివాదాలు, జోక్యం చేసుకున్నారు.[54]

1000 లో తూర్పు చాళుక్యుల అదృష్టం మలుపు తిరిగింది. వారి రాజు అయిన దనర్నవా 973 లో తెలుగు చోడ రాజు భీముడు యుద్ధంలో చంపబడ్డాడు. ఆ తరువాత చోడ భీముడు 27 సంవత్సరాలు ఈ ప్రాంతంలో తన పాలన సాగించాడు. ఈ సమయంలో దనర్నవ ఇద్దరు కుమారులు చోళ రాజ్యంలో ఆశ్రయం పొందారు. చోడ భూమా, తొండైమండలం, చోళ భూభాగం మీద దాడి చేయడం, యుద్ధరంగంలో మరణించడం చోళ-చాళుక్య సంబంధాలలో కొత్త శకానికి తెరతీసింది. దనర్నవుని పెద్ద కుమారుడు మొదటి శక్తివర్మను చోళరాజైన మొదటి రాజరాజ చోళుడి నియంత్రణలో వేంగిరాజ్యానికి రాజుగా కిరీటధారణ చేసాడు.[55] చోళులు, తీరప్రాంత ఆంధ్ర రాజ్యం మధ్య ఈ కొత్త సంబంధం పశ్చిమ చాళుక్యులకు ఆమోదయోగ్యం కాలేదు. ఫలితంగా పశ్చిమ దక్కనులో రాష్ట్రకూటులను ప్రధాన శక్తిగా నియమించారు. పాశ్చాత్య చాళుక్యులు వెంగి ప్రాంతంలో పెరుగుతున్న చోళ ప్రభావాన్ని తగ్గించడానికి విఫల ప్రయత్నం చేసారు.[54][56] ప్రారంభంలో తూర్పు చాళుక్యులు కన్నడ భాష, సాహిత్యాన్ని ప్రోత్సహించారు. అయినప్పటికీ కొంతకాలం తర్వాత స్థానిక అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తరువాత వారు తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇచ్చాయి.[57][58] తెలుగు సాహిత్యాభివృద్ధి ఘనత తూర్పుచాళుఖ్యులకు ఇవ్వబడుతుంది.[59]

మూలాలు[మార్చు]

  1. చాళుక్యుల పూర్వ స్థానము: The History of Andhras, G. Durga Prasad, 1988, Page 86; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf Archived 2007-03-13 at the Wayback Machine
  2. తెలుగు భాష, సాహిత్యము:Telugu Language and Literature, S. M. R. Adluri, 1998, http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/script1d.html Archived 2009-09-23 at the Wayback Machine
  3. ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి, మొదటి భాగం, రచయిత: బి. ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్,1990 పుట - 387
  4. 'బాదామి' లోని పురావస్తు శాఖ వారి మ్యూజియంలోని ఆధారాలు
  5. ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి, మొదటి భాగం, రచయిత: బి. ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్,1990 పుట - 437
  6. Thapar (2003), p. 326
  7. Popular theories regarding the name are: Puli – "tiger" in Kannada and Kesin – "haried" in Sanskrit; Pole – "lustrous" in Kannada, from his earliest Badami cliff inscription that literally spells Polekesi; Pole – from Tamil word Punai (to tie a knot; Ramesh 1984, pp. 31–32)
  8. The name probably meant "the great lion" (Sastri 1955, p. 134)
  9. The name probably meant "One endowed with the strength of a great lion" (Chopra 2003, p. 73, part 1)
  10. Kamath (2001), pp. 58–59
  11. Ramesh (1984), p. 76
  12. Chopra 2003, p. 74, part 1
  13. Quote:"His fame spread far and wide even beyond India" (Chopra 2003, p. 75 part 1)
  14. Quote:"One of the great kings of India". He successfully defied the expansion of king Harshavardhana of Northern India into the deccan. The Aihole inscription by Ravikirti describes how King Harsha lost his Harsha or cheerful disposition after his defeat. The Chinese traveller Hiuen Tsiang also confirms Pulakesi II's victory over King Harsha in his travelogue. Pulakesi II took titles such as Prithvivallabha and Dakshinapatha Prithviswamy (Kamath 2001, pp. 58–60)
  15. Quote:"Thus began one of the most colourful careers in Indian History" (Ramesh 1984, p. 76)
  16. Vikramaditya I, who later revived the Chalukya fortunes was born to Pulakesi II and the daughter of Western Ganga monarch Durvinita (Chopra 2003, p. 74, part 1)
  17. His other queen, an Alupa princess called Kadamba was the daughter of Aluka Maharaja (G.S. Gai in Kamath 2001, p. 94)
  18. Quote:"The Aihole record gives an impressive list of his military conquests and other achievements. According to the record, he conquered the Kadambas, the Western Gangas, the north Konkan by naval victory, Harsha of Thanesar, the Latas, the Malwas, the Gurjaras (thereby obtaining sovereignty over the Maharashtras), Berar, Maharashtra and Kuntala (with their nine and ninety thousand villages), the Kalingas and the Kosalas, Pishtapura (Pishtapuram in eastern Andhra) and Kanchipuram, whose king had opposed the rise of his power" (Chopra 2003, p. 74 part 1)
  19. Ramesh (1984), pp. 79–80, pp. 86–87
  20. According to Dr. R. C. Majumdar, some principalities may have submitted to Pulakesi II out of fear of Harsha of Kanauj (Kamath 2001, p. 59)
  21. Sastri (1955), pp. 135–136
  22. Chopra (2003), p. 75, part 1
  23. Sastri (1955), p. 136
  24. This is attested to by an inscription behind the Mallikarjuna temple in Badami (Sastri 1955, p. 136)
  25. Chopra (2003), pp. 75–76, part 1
  26. From the Gadval plates dated c. 674 of Vikramaditya I (Chopra 2003, p. 76, part 1)
  27. 27.0 27.1 Chopra (2003), p. 76, part 1
  28. Sastri (1955), p. 138
  29. 29.0 29.1 From the Kannada inscription at the Kailasanatha temple in Kanchipuram (Sastri 1955, p. 140)
  30. Kamath (2001), p. 63
  31. Thapar (2003), p. 331
  32. Ramesh (1984), pp. 159–160
  33. Dikshit, Durga Prasad (1980), p. 166–167, Political History of the Chālukyas of Badami, Abhinav Publications, New Delhi, OCLC 831387906
  34. Ramesh (1984), p. 159
  35. Ramesh (1984), pp. 173–174
  36. Kings of the Chalukya line of Vemulavada, who were certainly from the Badami Chalukya family line used the title "Malla" which is often used by the Western Chalukyas. Names such as "Satyashraya" which were used by the Badami Chalukya are also names of a Western Chalukya king, (Gopal B.R. in Kamath 2001, p. 100)
  37. Unlike the Badami Chalukyas, the Kalyani Chalukyas did not claim to be Harithiputhras of Manavysya gotra in lineage. The use of titles like Tribhuvanamalla marked them as of a distinct line (Fleet, Bhandarkar and Altekar in Kamath 2001, p. 100)
  38. Later legends and tradition hailed Tailapa as an incarnation of the God Krishna who fought 108 battles against the race of Ratta (Rashtrakuta) and captured 88 fortresses from them (Sastri 1955, p. 162)
  39. From his c. 957 and c.965 records (Kamath 2001, p. 101
  40. Vijnyaneshavara, the Sanskrit scholar in his court, eulogised him as "a king like none other" (Kamath 2001, p. 106)
  41. The writing Vikramankadevacharita by Bilhana is a eulogy of the achievements of the king in 18 cantos (Sastri, 1955 p. 315)
  42. Cousens 1926, p. 11
  43. Vikrama–Chalukya era of 1075 CE (Thapar 2003, p. 469)
  44. Chopra (2003), p. 139, part 1
  45. Sastri (1955), p. 175
  46. Kamath (2001), pp. 114–115
  47. Narasimhacharya (1988), pp. 18–20
  48. Sastri (1955), p. 192
  49. Pulakesi II made Vishnuvardhana the Yuvaraja or crown prince. Later Vishnuvardhana become the founder of the Eastern Chalukya empire (Sastri 1955, pp. 134–136, p. 312)
  50. 51.0 51.1 Chopra (2003), p. 132, part 1
  51. Kamath (2001), p. 8
  52. Kamath 2001, p. 60
  53. 54.0 54.1 54.2 Chopra (2003), p. 133
  54. Sastri (1955), pp. 164–165
  55. Sastri (1955), p. 165
  56. Narasimhacharya (1988), p. 68
  57. The Eastern Chalukya inscriptions show a gradual shift towards Telugu with the appearance of Telugu stanzas from the time of king Gunaga Vijayaditya (Vijayaditya III) in the middle of the 9th century, Dr. K.S.S. Seshan, University of Hyderabad. "APOnline-History of Andhra Pradesh-ancient period-Eastern Chalukyas". Revenue Department (Gazetteers), Government of Andhra Pradesh. Tata Consultancy Services. Archived from the original on 6 డిసెంబరు 2006. Retrieved 20 అక్టోబరు 2019.
  58. The first work of Telugu literature is a translation of Mahabharata by Nannaya during the rule of Eastern Chalukya king Rajaraja Narendra (1019–1061; Sastri 1955, p. 367)

Books

Web