గోదారంగనాయకస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోదారంగనాయకస్వామి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:పెద్దపల్లి జిల్లా
ప్రదేశం:తొగర్రాయి, సుల్తానాబాద్ మండలం

గోదారంగనాయకస్వామి దేవాలయం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలం, తొగర్రాయి గ్రామంలో ఉన్న దేవాలయం. 15వందల సంవత్సరాలక్రితం కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయ ప్రాంగణంలో గోదాదేవి సమేత రంగనాథస్వామి, శివకేశవులు కొలువుతీరారు.[1]

చరిత్ర[మార్చు]

తొగర్రాయి గ్రామ శివారులో గుండిబండ (పెద్ద బండ) ఉంది. 15వందల ఏళ్ళ కిందట కాకతీయులు ఈ బండమీద గోదాదేవి సమేత రంగనాథస్వామి, శివకేశవులకు ఆలయాలు నిర్మించారని చరిత్రను బట్టి తెలుస్తుంది. కాకతీయుల పాలన ముగిసిన తరువాత, మహ్మదీయుల పాలన వచ్చింది. వారు చేసిన దాడిలో ఈ రెండు దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి.

కొంతకాలం తరువాత ఈ ప్రాంతం పెద్దపల్లి సంస్థానాధీశుల పాలన కిందికి వచ్చింది. వారు పసుపుకుంకుమల కింద గుమ్మడికాయల పాడు,జారుబండపల్లె అనే గ్రామాలను ఒద్దిరాజులకు ఇచ్చారని, వారు ఈ దేవాలయాల్ని పునర్నిర్మించడంతోపాటు వాటి బాగోగులు చూసేవారని తెలుస్తుంది. గుమ్మడికాయలపాడు వాసులు గ్రామం నుండి కొంతదూరం వెళ్లి రాళ్లతో కూడిన ప్రాంతంలో మరో గ్రామాన్ని నిర్మించుకున్నారు. అయితే ఆ గ్రామానికి మొత్తం నాపరాయి, పలుగురాళ్లతో కూడిన తొవ్వ (దారి) ఉండడంతో ఆ గ్రామానికి తొగర్రాయి అని పేరు వచ్చింది.[2]

గుడి నిర్మాణం[మార్చు]

దాడి కారణంగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాలను ప్రభుత్వ దేవాదాయ ధర్మదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకొని ఆధునీకరించింది.

ఉత్సవాలు[మార్చు]

ప్రతి సంవత్సరం గోదారంగనాయకుల కళ్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతాయి. ఈ ఉత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అనేక సంఖ్యలో ప్రజలు వచ్చి పాల్గొంటుంటారు. ఈ ప్రదేశంలో బతుకమ్మ, సమ్మక్క సారక్క పండుగలను కూడా జరుపుకుంటారు.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ ఆదివారం సంచిక (27 January 2019). "వెయ్యేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం". Archived from the original on 20 March 2019. Retrieved 20 March 2019.
  2. వి6 వెలుగు, లైఫ్ (8వ పేజీ) (19 March 2019). "తొగర్రాయిలో గుడిబండ". Archived from the original on 21 March 2019. Retrieved 21 March 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)