గోల్కొండ సాహితీ మహోత్సవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోల్కొండ సాహితీ మహోత్సవం[మార్చు]

గోల్కొండ సాహితీ మహోత్సవ్ (ఆంగ్లం: Golkonda Literary Festival) అనేది హైదరాబాద్ నగరంలో 2021లో నవంబర్ 20, 21 తేదిలలో సమాచార భారతి అద్వర్యంలో నిర్వహించబడిన కార్యక్రమం.[1][2] ఈ సంవత్సరం భారతదేశం 75 స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో 1947 కు పూర్వం జరిగిన సాహిత్య, నాటి సమాజ స్థితిగతులు, పోరాటాలు, ఉద్యమంలో పాల్గొన్న దేశ భక్తులను స్మరించుకొనే కార్యక్రమం.

అందుకు సంబందించిన వివరాలను కార్యక్రమ నిర్వాహుకులు సమాచార భారతి సభ్యులు హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం కేశవ మెమోరియల్ కాలేజ్ అఫ్ కామర్స్ అండ్ సైన్సు, నారాయణగూడ, హైదరాబాద్ లో జరుగుతుంది. ఇందులో ప్రదానంగా స్వధర్మం, స్వరాజ్య, స్వాభిమానం అనే అంశాలు ప్రధానంగా తీసుకొని చర్చ, సంగోస్టి లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవం లో భాగంగా వ్యాస రచనలు కోరడం Archived 2021-11-16 at the Wayback Machine జరిగింది.


పలు పుస్తకాల ఆవిష్కరణ తో సహా , స్వతంత్ర చరిత్ర పై సాహిత్య రంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు.

మొదటి రోజు కార్యక్రమాలు

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ, గవర్నర్, హర్యానా పాల్గొన్నారు. వారి తో పాటు శ్రీ కిషన్ రెడ్డి , కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖామాత్యులు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన PIB వారి ప్రచురణ విభాగం వారు , స్వతంత్ర వీరుల ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు

మూలాలు[మార్చు]

  1. "ఈ నెల 20, 21 తేదీల్లో గోల్కొండ సాహితీ ఉత్సవం". andhrajyothy. Retrieved 2021-11-16.
  2. "20, 21 తేదీల్లో గోల్కొండ లిటరరీ ఫెస్ట్‌". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-07. Retrieved 2021-11-16.