చర్చ:భారతదేశ విభజన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • పాకిస్తాన్‌ ,ఇండియా,బంగ్లాదేశ్ లను కలిపి అఖండ భారత్ అంటారు.అంటే 1947 ఆగస్టు15 కు ముందున్న భారతదేశం.బ్రిటీష్ వాళ్ళు హిందూ ముస్లిములు కలిసి ఉన్న ఈ విశాల దేశాన్ని పాలించి,రెండు దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి పోయారు.దేశ విభజనతో ఇరువైపులవారూ ఎన్నో కష్టాలు పడ్డారు.జన్మస్థలాలనూ,పితరులనూ బంధువులనూ అటూ ఇటూ అందరూ కోల్పోవలసి వచ్చింది.హృదయవిదారక సంఘటనలు జరిగాయి.విశ్వహిందూ పరిషత్,బజరంగదళ్,దుర్గావాహిని మొదలైన సంస్తలు నేటికీ అఖండ భారత్ సాధించాలని కృషిచేస్తున్నాయి.అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన సరస్వతి పీఠం పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాదుకు 150 కి.మీ. దూరంలో ఉంది.అలాగే వేదాలు పుట్టిన సింధూ నదీప్రాంత పవిత్రభూమి కూడా పాకిస్థాన్ లోనే ఉంది.పాకిస్తాన్‌ వ్యవ స్థాపకుడు జిన్నా, కాలానుగ తంగా భిన్నవ్యక్తిత్వాలను ప్రదర్శించారని ఆరెస్సెస్‌ మాజీ చీఫ్‌ కె.ఎస్‌ సుదర్శన్‌ అన్నారు. ఒక దశలో ఆయన లోక్‌మాన్య తిలక్‌తో కలసి అఖండ భారతావనికి కట్టుబడి పని చేశారని సుదర్శన్‌ పేర్కొన్నారు. గాంధీ గనుక విభజన కూడ దంటూ పట్టుబట్టి ఉంటే, విభజన జరిగి ఉండేదే కాదని’ అన్నారు. ముస్లింలీగ్‌ నేత జిన్నా లౌకిక వాది అన్నారు సుదర్శన్‌.టర్కీలో ఖలీఫా పదవీభ్రష్ఠుడైతే దాంతో భారత్‌కు ఏం సంబంధమని కూడా జిన్నా ప్రశ్నించి నట్లు సుదర్శన్‌ గుర్తు చేశారు.పాకిస్తాన్‌ పర్యటన సందర్భంగా జిన్నాను ప్రశంసించాడు అద్వానీ .దేశ విభజనకు జిన్నా బాధ్యుడు కారని, ఆయన అఖండ భారత్‌ను కోరుకున్నారని జశ్వంత్‌సింగ్‌ అన్నారు.దేశ విభజనలో జిన్నాకు ఎలాంటి పాత్ర లేదని హిందూ మహాసభ నాయకుడు, తర్వాత జనసంఘ్‌, బిజెపిల ఆవిర్బావానికి మూలకారకుడైన శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చెప్పారు.గాడ్సే కోరినట్లు మళ్ళీ అఖండ భారత్ వస్తే మంచిదే.కానీ గాడ్సే గాంధీజీ ని చంపటం మహా నేరం. --Nrahamthulla 09:36, 7 ఆగష్టు 2010 (UTC)
  • జిన్నా లౌకికవాది ఐతే పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఎందుకు అవతరించింది? భారత్ లాగా లౌకిక దేశంగా ఉండేది. పాక్ లోని మైనారిటీల సంఖ్య విభజన నాటి కంటే ప్రస్తుతం ఎందుకు అంత్యంత స్వల్పంగా ఉంది? భారత్ లో మాత్రం ముస్లిమ్ ల సంఖ్య మాత్రం పాక్ కన్నా ఎక్కువ అయ్యింది.లౌకిక వాదం అనేది కేవలం హిందువులకు మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుంది. అఖండ భారత్ కోసం కొన్ని సంస్ధలు కృషి చేస్తున్నాయని అన్నారు. కాని ghazwa e hind గురించి ప్రస్తావించలేదు.. మీరు ప్రస్తావించిన సంస్ధలు ఏ రకంగా కృషి చేస్తున్నాయో, అసలు చేస్తున్నాయో లేదో తెలుపలేదు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అల్‌ఖైదాలు అదే పనిలో ఉన్నాయి. కాక పోతే వారు ఎంచుకున్న మార్గాలు వేరు. వారి ప్రయత్నాలు సఫలీకృతం అయితే భారత్ కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ అవుతుంది. విభజన హిందువులకు దేవుడిచ్చిన వరం. గాంధీని నమ్మకుని జిన్నాకి అధికారం ఇస్తే పాక్ లాగా మన దేశంలోనూ సైనిక పాలన తప్పేది కాదు. కాశ్మీరు నుండి 5 లక్షల హిందువులను తరిమేసినట్లు యావత్ భారత దేశంలోనూ జరిగేది. గాడ్సే గాంధీని చంపటం వల్ల నేడు కోట్లాది హిందువులు ఇంకా బ్రతికే ఉన్నారు, అది కూడా ప్రజాస్వామ్యంలో. తెలిసో తెలీకో కోట్ల ప్రాణలను కాపాడటానికి ఒక్క ప్రాణం తీశాడు. గాంధీ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు, మరి మానవ బాంబు పెడితే ఏం చేయాలి? --శశికాంత్ 12:52, 7 ఆగష్టు 2010 (UTC)