చిలకపచ్చ కాపురం
చిలకపచ్చ కాపురం | |
---|---|
![]() | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
నిర్మాత | సి. సురేంద్ర రాజు |
తారాగణం | జగపతిబాబు , మీనా , సౌందర్య |
సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1995 జూలై 2[1] |
భాష | తెలుగు |
చిలకపచ్చ కాపురం 1995 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా.[2] ఇందులో జగపతి బాబు, సౌందర్య, మీనా ముఖ్య పాత్రల్లో నటించారు.
కథ[మార్చు]
ఓ గ్రామంలో నివసించే బావ బావమరుదులు పరశురామయ్య, బుల్లెబ్బాయి మధ్య పరస్పర విరోధం కలుగుతుంది. ఇద్దరూ గ్రామంలో పెద్ద మనుషులే. ఆ గ్రామంలోనే గోదావరి నది మీద పడవ నడుపుకునే గోపాలకృష్ణ ఊర్లో వారందరికీ తలలో నాలుకలా ఉంటాడు. పరశురామయ్య, బుల్లెబ్బాయి ఇద్దరికీ ఇతనంటే అభిమానమే. అదే చొరవతో గోపాలకృష్ణ వీరిద్దరి కుటుంబాలను కలపాలని ప్రయత్నిస్తుంటాడు.
పరశురామయ్య కూతురైన సత్యవతి గోపాలకృష్ణ బాల్య స్నేహితురాలు. ఆమె గోపాలకృష్ణను మనసులోనే ఆరాధిస్తుంటుంది కానీ అతను మాత్రం ఆమెను ఓ స్నేహితురాలిగా మాత్రమే చూస్తుంటాడు. బుల్లెబ్బాయి పట్నం నుంచి రాధ అనే అమ్మాయిని తెచ్చి తన ఇంట్లో ఉంచుకుంటాడు. గోపాలకృష్ణ ఆమెను మొదటిసారి చూడగానే మనసు పారేసుకుంటాడు. రాధ తన అవసరాలు తీర్చడానికి గోపాలకృష్ణతో తప్ప బయటి వాళ్ళెవ్వరితోనూ కలవదు.
తారాగణం[మార్చు]
- గోపాలకృష్ణ గా జగపతి బాబు
- సత్యవతి గా సౌందర్య
- రాధ గా మీనా
- బుల్లెబ్బాయి గా చరణ్ రాజ్
- గిరిబాబు
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- పరశురామయ్య గా ముక్కా నరసింహ రావు
- బుల్లెబ్బాయి భార్య గా అన్నపూర్ణ
- సిల్క్ స్మిత
- రాములమ్మ గా శుభ
- పరశురామయ్య భార్యగా డబ్బింగ్ జానకి
పాటలు[మార్చు]
ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీత దర్శకత్వం వహించాడు.
మూలాలు[మార్చు]
- ↑ "చిలకపచ్చ కాపురం". thetelugufilmnagar.com. Retrieved 12 February 2018.
- ↑ "చిలకపచ్చ కాపురం". bharat-movies.com. Archived from the original on 30 నవంబరు 2017. Retrieved 12 February 2018.