చెన్నపురీ విలాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1920లో ముద్రించబడిన పుస్తక ముఖచిత్రం.

చెన్నపురీ విలాసము ఒక పద్య కావ్యము. దీనిని తెనాలికి చెందిన మతుకుమల్లి నృసింహ కవి 1863 సంవత్సరంలో రచించెను. దీనిని 1920 సంవత్సరంలో బ్రహ్మశ్రీ మతుకుమల్లి రఘోత్తమరాయశాస్త్రి గారు ముద్రించగా; చివరగా 1941 లో వావిళ్ళ రామస్వామి శాస్త్రులుగారి వావిళ్ళ ముద్రణాలయంలో ముద్రించారు.

ఈ కవి చెన్నపురిని, గూడూరు, వల్లూరు జమిందారైన బొమ్మదేవర నాగభూపాలునితో కలిసి సందర్శించాడు. దీనిని ఆరు అధ్యాయాలుగా విభజించారు. ఈ పుస్తకంలో 232 అచ్చ తెలుగు పద్యాలు, ఒక్కొక్క దానిలో 4-5 పంక్తులు కలిగినవిగా నాటి చెన్నపురి అనగా నేటి చెన్నైలో నివసించే ప్రజలు, వేషభాషలు, అలవాట్లను విపులంగా వివరించాయి. ఇందులో పట్టణంలోని వింతలు, విశేషాలు, నగర ప్రణాళిక మొదలైన వాటిని వివరించారు.

బయటి లింకులు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: