తిరుమలై కృష్ణమాచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణమాచార్య
జననం(1888-11-18)1888 నవంబరు 18
చిత్రదుర్గ జిల్లా, మైసూరు సామ్రాజ్యం
మరణం1989 ఫిబ్రవరి 28(1989-02-28) (వయసు 100)
మద్రాసు
జాతీయతభారతీయుడు
వృత్తియోగాధ్యాపకుడు, పండితుడు, ఆయుర్వేద వైద్యుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆధునిక యోగా పితామహుడు

తిరుమలై కృష్ణమాచార్య (1888 నవంబరు 18 - 1989 ఫిబ్రవరి 28)[1][2] భారతీయ యోగా గురువు, ఆయుర్వేద వైద్యుడు, పండితుడు. ఈయనను ముఖ్యమైన యోగా గురువుల్లో ఒకడిగా, ఆధునిక యోగా పితామహుడిగా భావిస్తారు.[3] యోగాసనాలతో ఆయన విశేషమైన ప్రభావం కనబరిచాడు.[4][5] ఈయన హఠయోగాన్ని పునరుద్ధరించడంలో కృషి చేశాడు.[6][7]

కృష్ణమాచార్యులు ఆరు భారతీయ దర్శనాల్లోనూ (షడ్దర్శనములు) డిగ్రీలు కలిగి ఉన్నాడు. మైసూరు మహారాజైన నాలుగవ కృష్ణరాజ ఒడయారు ప్రాపకంలో ఈయన భారతదేశమంతా పర్యటించి యోగా విశిష్టతను గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. హృదయ స్పందనను ఆపడం లాంటి విశేషమైన ప్రతిభను ప్రదర్శించాడు.[8] ఈయన యోగా మీద నాలుగు పుస్తకాలు రాశాడు. యోగా మకరంద (1934), యోగాసనాలు (1941),[9] యోగ రహస్య, యోగావళి. ఇంకా కొన్ని వ్యాసాలు, పద్యాలు రాశాడు.[7]

మూలాలు[మార్చు]

  1. Mohan 2010, p. 125.
  2. "Krishnamacharya Yoga Mandiram". Archived from the original on 11 ఏప్రిల్ 2015.
  3. Singleton & Fraser 2014, pp. 83–106.
  4. Mohan, A. G.; Mohan, Ganesh (5 April 2017) [2009]. "Memories of a Master". Yoga Journal. Archived from the original on 15 March 2010.
  5. "The YJ Interview: Partners in Peace". Yoga Journal. Archived from the original on 21 May 2016.
  6. Pagés Ruiz 2001.
  7. 7.0 7.1 Singleton 2010, p. 111.
  8. Mohan 2010, p. 7.
  9. Singleton 2010, p. 240.