దండు నారాయణరాజు
Jump to navigation
Jump to search
దండు నారాయణరాజు | |
---|---|
జననం | దండు నారాయణరాజు ఆగష్టు 15, 1889 భీమవరం తాలూకా నేలపోగుల |
మరణం | జనవరి 30, 1944 |
మరణ కారణం | గుండె జబ్బు |
తండ్రి | భగవాన్ రాజు |
దండు నారాయణరాజు (ఆగష్టు 15, 1889 - జనవరి 30, 1944) ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు.
బాల్యము, విద్య[మార్చు]
వీరు భీమవరం తాలూకా నేలపోగుల గ్రామంలో భగవాన్ రాజు దంపతులకు 1889, 15 ఆగష్టు తేదీన జన్మించారు. వీరు బి.ఎ., బి.ఎల్. చదివారు.
స్వాతంత్ర్య సాధన లో[మార్చు]
- 1920 లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు.
- ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930 సంవత్సరంలో జైలు శిక్ష అనుభవించారు.
- శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు 1932లో 7 నెలలు, వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 1940లో 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు.
రాజకీయ జీవితం[మార్చు]
వీరు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ నేతలలో ముఖ్యులు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా ఉన్నతమైన సేవ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా 4 సంవత్సరాలు పనిచేశారు. 1937 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.
మరణం[మార్చు]
క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 1942 లో తంజావూరు జైల్లో ఉంటూ 1944, జనవరి 30 న అక్కడే గుండె జబ్బుతో మరణించారు.